Koratala Siva: షాట్ రెడీ అయ్యాక కాల్ చేస్తా.. సెట్కి రండి..!
కోటీశ్వరులు కావాలనుకునే సామాన్యుల కలలను నిజం చేస్తూ ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతోన్న రియాల్టీ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా..
ఎన్టీఆర్కు కొరటాల శివ రిక్వెస్ట్
హైదరాబాద్: కోటీశ్వరులు కావాలనుకునే సామాన్యుల కలలను నిజం చేస్తూ ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతోన్న రియాల్టీ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ షోలో తాజాగా ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ సందడి చేశారు. గెలుచుకున్న మొత్తాన్ని రామకృష్ణ మఠానికి అందించాలనే మంచి ఉద్దేశంతో గేమ్ ప్రారంభించిన దర్శకులిద్దరూ రూ.25 లక్షలు గెలుపొందారు. కాగా, షోలో భాగంగా ఎన్నో ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.
తమ కిష్టమైన కార్టూన్ సిరీస్ల గురించి చెప్పమని ఎన్టీఆర్ కోరగా టామ్ అండ్ జెర్రీ అంటే ఇష్టమని దర్శకులిద్దరూ సమాధానమిచ్చారు. అనంతరం ఎన్టీఆర్ సైతం తనకి చిన్నప్పటి నుంచి టామ్ అండ్ జెర్రీ అంటే అమితమైన అభిమానమని.. ఇప్పటికీ సమయం దొరికినప్పుడు ఆ కార్టూన్ని చూస్తానని అన్నారు. తన పిల్లలు భార్గవ్, అభయ్లు ఇవేమీ చూడరని.. యాక్షన్ తరహా కార్టూన్స్ చూస్తారని.. ఎప్పుడైనా ఇంట్లో నిద్రపోతుంటే.. అభయ్ వచ్చి ముఖంపై కొట్టి అక్కడి నుంచి పారిపోతాడని ఎన్టీఆర్ చెప్పి నవ్వులు పూయించారు. దీనిపై స్పందించిన కొరటాల శివ.. ‘నిజమే పిల్లల అభిరుచి మారిపోయింది. ఇదే విషయమై మొన్న చిరంజీవి సార్ నాతో మాట్లాడారు. ఆయన సోఫాలో నిద్రపోతుంటే ఆయన మనవరాలు వచ్చి నుదిటిపై కొట్టి పారిపోయింది అంట. తర్వాత ఆయన ఐస్ బ్యాగ్ పెట్టుకున్నారట’ అని అన్నారు.
సమయపాలనను తారక్ చాలా అద్భుతంగా పాటిస్తారని ప్రశంసించిన శివ షూటింగ్ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ‘అందరికంటే ముందు తారక్ సెట్లోకి వచ్చేస్తారు. సమయపాలనను ఆయన చాలా చక్కగా ఫాలో అవుతారు. ఒక్కొసారి నా కారు కూడా ఓవర్టేక్ చేసి మరీ ఆయన సెట్లోకి వస్తారు. తారక్.. త్వరలో మన కొత్త సినిమా పట్టాలెక్కనుంది. సెట్ కూడా మీ ఇంటి పక్కనే వేయిస్తున్నాను. షాట్ రెడీ కాగానే ఫోన్ చేస్తాను మీరు అప్పుడు సెట్కి రండి’ అని శివ నవ్వులు పూయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్