Toxic: టాక్సిక్‌ కోసం ఇద్దరు నాయికలు?

కన్నడ కథానాయకుడు యశ్‌ తన తదుపరి చిత్రంగా ‘టాక్సిక్‌’ను ప్రకటించారు. గీతూ మోహన్‌ దాస్‌ తెరకెక్కిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమాని కె.వి.ఎన్‌ ప్రొడక్షన్స్‌, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మించనున్నాయి. ఈ చిత్రం త్వరలో సెట్్సపైకి వెళ్లనున్న నేపథ్యంలో మిగిలిన తారాగణాన్ని ఖరారు చేసే పనిలో పడింది చిత్ర బృందం.

Updated : 15 Dec 2023 09:51 IST

కన్నడ కథానాయకుడు యశ్‌ తన తదుపరి చిత్రంగా ‘టాక్సిక్‌’ను ప్రకటించారు. గీతూ మోహన్‌ దాస్‌ తెరకెక్కిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమాని కె.వి.ఎన్‌ ప్రొడక్షన్స్‌, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మించనున్నాయి. ఈ చిత్రం త్వరలో సెట్సపైకి వెళ్లనున్న నేపథ్యంలో మిగిలిన తారాగణాన్ని ఖరారు చేసే పనిలో పడింది చిత్ర బృందం. ఇందులో ఇద్దరు కథానాయికలకు అవకాశమున్నట్లు సమాచారం అందుతోంది. వాటిలో ఓ పాత్ర కోసం సాయిపల్లవి పేరు పరిశీలనలో ఉన్నట్లు ఇప్పటికే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కాగా, ఇప్పుడు మరో పాత్ర కోసం శ్రుతిహాసన్‌ పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది. మరి వీళ్లతో ఇప్పటికే సంప్రదింపులు జరిగాయా? లేదా? అన్నది స్పష్టత రాలేదు. సాయిపల్లవి ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి ‘తండేల్‌’లో నటిస్తోంది. శ్రుతిహాసన్‌ ‘సలార్‌’తో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. దీంతో పాటు అడివి శేష్‌తో కలిసి ఓ యాక్షన్‌ డ్రామాలో నటించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని