ఇది కూడా దేవుడికే వదిలేద్దామా?
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్, చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కేంద్రం మీద తన విమర్శల పర్వాన్ని కొనసాగించారు.
చైనా దురాక్రమణపై రాహుల్ వ్యాఖ్య
దిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్, చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కేంద్రం మీద తన విమర్శల పర్వాన్ని కొనసాగించారు. జీఎస్టీ మండలి సమావేశంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యను ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు. లద్దాఖ్ ప్రాంతంలో చైనా దురాక్రమణను కూడా ప్రభుత్వం దైవ ఘటనగానే భావిస్తుందా? అంటూ శుక్రవారం ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ‘చైనా మన భూభాగాన్ని ఆక్రమించింది. భారత ప్రభుత్వం ఎప్పుడు దాన్ని వెనక్కి తీసుకురాగలుగుతుంది? లేకపోతే దీన్ని ‘దైవ ఘటన’ ఖాతాలోకి చేరుస్తారా?’ అని ట్వీట్ చేశారు.
ఇటీవల జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ..జీఎస్టీ వసూళ్లపై కరోనా వైరస్ ప్రభావం చూపిందని, దాని కారణంగా 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.2.35లక్షల కోట్ల మేర లోటు ఏర్పడిందన్నారు. ఆ సందర్భంలోనే ఆమె ‘దైవ ఘటన’ పదాన్ని వాడారు. దీనిపై అప్పట్లో కాంగ్రెస్ విమర్శలు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.