సొంత మంత్రినే ఒప్పించలేదు, రైతులకేం చెప్తారు?
కేంద్రం వ్యవసాయ సంబంధిత బిల్లులతో రైతులను మోసం చేస్తోందని రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఆరోపించారు. ఆ వ్యవసాయ బిల్లుల విషయంలో సొంత కేబినెట్లో ఉన్న మంత్రిని ఒప్పించలేకపోయారు..
జైపూర్: కేంద్రం వ్యవసాయ సంబంధిత బిల్లులతో రైతులను మోసం చేస్తోందని రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఆరోపించారు. ఆ వ్యవసాయ బిల్లుల విషయంలో సొంత కేబినెట్లో ఉన్న మంత్రిని ఒప్పించలేకపోయారు.. మరి రైతులను ఏం ఒప్పిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల బాగు కోసం కేంద్రం వెంటనే ఈ బిల్లుల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం కేంద్రంపై విమర్శలు కురిపిస్తూ.. ట్విటర్లో ఓ వీడియో విడుదల చేశారు.
‘వ్యవసాయ బిల్లుల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే తప్పు చేసింది. ఆ బిల్లులను వెనక్కి తీసుకోవాలి. రాజ్యసభలో అవి అప్రజాస్వామికంగా ఆమోదం పొందాయి. అందువల్లే ఈ రోజు వాటి విషయంలో దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. అదే కారణంతో మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేశారు. సొంత మంత్రిని ఒప్పించలేని కేంద్రం.. రైతులను ఎలా ఒప్పించగలదు? రైతులు ప్రతి ఒక్క విషయం అర్థం చేసుకోగలరు. కాంగ్రెస్ ఎప్పుడూ రైతుల పక్షానే ఉంటుంది. భాజపా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనే వాగ్దానాన్ని పక్కన పెట్టింది. కనీసం రాష్ట్రాలను, రైతు సంఘాలతో సంప్రదింపులు జరపకుండా కేంద్రం బిల్లుల్ని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. సంస్కరణలు అందరూ కోరుకుంటున్నారు. కానీ ఇవి మాత్రం రైతులకు, దేశానికి వ్యతిరేకమే’ అని పైలట్ ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం