మార్క్ జుకర్బర్గ్కు కాంగ్రెస్ లేఖ
కొద్ది రోజులుగా అధికార భాజపా, విపక్ష కాంగ్రెస్ల మధ్య ఫేస్బుక్కు సంబంధించి తీవ్ర మాటల యుద్ధం జరుతుంది. తాజాగా భారత్లోని ఫేస్బుక్ సంస్థ ఉద్యోగులపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది....
ఫేస్బుక్ ఇండియా డైరెక్టర్ పాత్రపై విచారణ చేయించాలని డిమాండ్
దిల్లీ: కొద్ది రోజులుగా అధికార భాజపా, విపక్ష కాంగ్రెస్ల మధ్య ఫేస్బుక్కు సంబంధించి తీవ్ర మాటల యుద్ధం జరగుతూనే ఉంది. తాజాగా భారత్లోని ఫేస్బుక్ సంస్థ ఉద్యోగులపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్కు లేఖ రాశారు. దీనిని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘ మేం కష్టపడి సాధించుకున్న ప్రజాస్వామ్యంలో పక్షపాతం, నకిలీ వార్తలు, విద్వేష పూరిత ప్రసంగాలతో చేయాలనుకునే ఎలాంటి మార్పులను అంగీకరించబోం. నకిలీ, విద్వేష పూరిత వార్తల ప్రచారంలో ఫేస్బుక్ పాత్రపై వాల్స్ట్రీట్ జనరల్ పత్రిక వెలుగులోకి తీసుకొచ్చిన విషయాలను ప్రతి ఒక్క భారతీయుడు ప్రశ్నించాలి’’ అని రాహుల్ ట్వీట్లో పేర్కొన్నారు.
ఇక లేఖలో వాల్స్ట్రీట్ జనరల్ పత్రిక తన కథనంలో పేర్కొన్నట్లు ఫేస్బుక్ ఇండియా డైరెక్టర్ (పబ్లిక్ పాలసీ) ఆంఖీ దాస్తో పాటు దీనితో సంబంధం ఉన్న వ్యక్తుల పాత్రపై విచారణ చేపట్టాలని జుకర్బర్గ్ను కాంగ్రెస్ కోరింది. దానికి సబంధించిన నివేదికను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేసింది. భాజపాతో సహా అనుబంధ సంస్థలకు అనుకూలంగా భారత్లో ఫేస్బుక్ వ్యవహరిస్తూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈ నెల 14న ఒక వార్తా కథనం వెలుగులోకి వచ్చింది. ఇది భాజపా-కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధానికి తెర తీసింది. ఈ నేపథ్యంలో తనకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఆన్లైన్ ద్వారా బెదిరింపులు వస్తున్నాయని ఆంఖీ దాస్ దిల్లీ సైబర్ క్రైం విభాగానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు దిల్లీ అల్లర్లను ఎగదోయడం వెనక ఫేస్బుక్ భారతదేశ ఉన్నతాధికారి పాత్ర ఏమైనా ఉందా అనేది తెలుసుకునేందుకు ఆ సంస్థకు సమన్లు జారీ చేయాలని దిల్లీ శాసనసభా సంఘం నిర్ణయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?