ప్రమాణస్వీకారం చూడ్డానికెళ్లి.. మంత్రిగా వచ్చి..!
మాజీ రాష్ట్రపతి, భరతమాత ముద్దుబిడ్డ ప్రణబ్ ముఖర్జీ అస్తమయమయ్యారు. సాధారణ వ్యక్తిగా మొదలైన ఆయన జీవితం దేశ ప్రథమ పౌరుడి స్థాయి వరకు ఎదిగింది. ఈ క్రమంలో ఆయన పడిన కష్టం, చేసిన కృషి........
ఇంటర్నెట్ డెస్క్: మాజీ రాష్ట్రపతి, భరతమాత ముద్దుబిడ్డ ప్రణబ్ ముఖర్జీ తుది శ్వాస విడిచారు. ఓ సాధారణ ఉద్యోగిగానే మొదలైన ఆయన జీవితం దేశ ప్రథమ పౌరుడి స్థాయి వరకు ఎదిగింది. ఈ క్రమంలో ఆయన పడిన కష్టం, చేసిన కృషి, పట్టుదల ఆయన్ను దేశ రాజకీయాల్లో విలక్షణమైన ధ్రువతారలా వెలిగేలా నిలిపింది. రాజకీయ ప్రస్థానంలో ఆయన ఎక్కిన ఒక్కొక్క మెట్టూ నల్లేరు మీద నడకలా ఏమీ సాగలేదు. జీవితంలో ఎన్నో డక్కామొక్కీలు తిన్నారు. రాజకీయాల్లో ఎన్నో ఉత్థానపతనాలను చూసిన ప్రణబ్ దాదాకు కేంద్రమంత్రి పదవి అనూహ్యంగా ఎలా దక్కింది? ఆయన పాటించిన కొన్ని ముఖ్యమైన అలవాట్లు, ఇష్టాలు ఏంటి..?
అది 1973.. ప్రణబ్కు కేంద్ర సహాయ మంత్రి వరించిన సంవత్సరం.. ఈ పదవి విచిత్రకర పరిస్థితుల్లో దక్కింది. మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చూడటానికి రాష్ట్రపతి భవన్కు వెళ్లిన ప్రణబ్ ముఖర్జీ కేంద్ర సహాయ మంత్రిగా బయటకొచ్చారు. ప్రమాణం చేయబోయే మొత్తం మంత్రుల సంఖ్య అశుభకరమని ‘పెద్దలు’ భావించడంతో ప్రణబ్ను పారిశ్రామిక అభివృద్ధి శాఖ సహాయ మంత్రిని చేసి ‘లెక్క’ను సరిచేశారు. దీంతో అప్పటి నుంచి ప్రణబ్ రాజకీయ ‘లెక్కలు’ దాదాపుగా తప్పలేదు. రాజీవ్ హయాంలో రాజకీయ చీకటి అంటే ఏమిటో రుచి చూసి మళ్లీ ‘వెలుగు’లోకి వచ్చిన తర్వాత ఇక పల్లమంటూ ఎరగలేదు. 1978లో సీడబ్ల్యూసీకి ఎంపికైన ప్రణబ్ 1980లో పార్టీలో నంబర్ 2 స్థానానికి ఎదిగారు. ఇందిరకు కీలక సలహాదారుడిగా ఉన్నారు.
పల్లెటూరి అబ్బాయి అనిపించుకోవడమే ఇష్టం!
దాదాగా సుపరిచుతుడైన ప్రణబ్ను సన్నిహితులు ముద్దుగా పొల్తు అని పిలుచుకొనేవారు. ప్రణబ్ ముఖర్జీకి రోజూ డైరీ రాసే అలవాటు ఉంది. ఎంత తీరిక లేకున్నప్పటికీ రోజూ ఒక పేజీ అయినా రాయడం అలవాటు. రోజూ ప్రణబ్ వేకువజామునే నిద్ర లేచేవారు. పూజ అనంతరం ఇక విధుల్లో మునిగిపోయేవారు. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు పుస్తక పఠనం అలవాటు. మధ్యాహ్నం ఓ గంట పాటు కునుకు తీయడం అలవాటు. దాదాపు 17 ఏళ్లు స్వగ్రామంలోని పూర్వికుల ఇంట్లోనే ఉన్న ప్రణబ్కు స్వగ్రామం, ఆ ఇల్లు అంటే ఎంతో మమకారం. ఇప్పటికీ ఆయన తనను పల్లెటూరి అబ్బాయి అనిపించుకోవడానికే ఇష్టపడేవారు. ప్రణబ్ ముఖర్జీకి చేపల కూర అంటే ఎంతో ఇష్టం. మంగళవారాలు తప్పించి దాదాపు రోజూ చేపల కూర ఉండాల్సిందే!
లక్కీ నంబర్ 13
అందరూ దురదృష్టమైనదిగా భావించే ‘13’ ప్రణబ్ ముఖర్జీకి అదృష్ట సంఖ్య. ఈ సంఖ్యతో ప్రణబ్కు ఎంతో అనుబంధం ఉంది. భారత 13వ రాష్ట్రపతిగా ఆయన ఎన్నికకావడం గమనార్హం. ఆయన లోక్సభకు తొలిసారిగా ఎన్నికైంది 2004 మే 13న. ప్రణబ్కు వివాహమైంది 1957 జులై 13న. ఆయన అప్పట్లో నివసించిన తల్కతొరా రోడ్డులోని 13వ నంబర్ ఇంటిలోనే. యూపీఏ ప్రభుత్వంలో వివాదాల పరిష్కర్తగా ప్రముఖ పాత్ర పోషించిన ప్రణబ్కు పార్లమెంటు రూమ్ నంబర్ 13లోనే కార్యాలయం ఉండేది.
ఇదీ చదవండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం