రాహుల్ స్టైల్లోనే కౌంటర్ ఇచ్చిన భాజపా
ప్రధాని మోదీ నేతృత్వంలోని భాజపా సర్కార్ గత కొన్ని రోజులుగా సాధించిన విజయాలు ఇవేనంటూ కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో.. భాజపా కూడా కౌంటర్ ఇచ్చింది. రాహుల్గాంధీ
దిల్లీ : ప్రధాని మోదీ నేతృత్వంలోని భాజపా సర్కార్ గత కొన్ని రోజులుగా సాధించిన విజయాలు ఇవేనంటూ కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో.. భాజపా కూడా కౌంటర్ ఇచ్చింది. రాహుల్గాంధీ స్టైల్లోనే విమర్శించి.. మీరు సాధించిన విజయాలేంటో గుర్తుచేసుకోండని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.
రాహుల్ సాధించిన విజయాలివే అంటూ కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఎద్దేవా చేశారు. ట్వీట్లకే పరిమితమైన పార్టీగా కాంగ్రెస్ విలువ పడిపోయిందని విమర్శించారు.
ఫిబ్రవరి : షాహీన్ బాగ్ అల్లర్లు
మార్చి : జ్యోతిరాదిత్య సింధియాతోపాటు మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కోల్పోవడం
ఏప్రిల్ : కార్మికులను ప్రేరేపించడం.
మే : చారిత్రక ఎన్నికల ఓటమికి ఆరో వార్షికోత్వం
జూన్ : చైనా తరఫు వాదించడం
జులై : రాజస్థాన్లో పార్టీని కూల్చుకోవడం
అంతకుముందు.. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో మోదీ సర్కార్ సాధించిన విజయాలివే అంటూ రాహుల్ ట్విటర్లో విమర్శించారు.‘ఫిబ్రవరి: హలో ట్రంప్, మార్చి: మధ్యప్రదేశ్లో ప్రభుత్వ కూల్చివేత, ఏప్రిల్: కరోనాపై పోరుకు కొవ్వొత్తుల్ని వెలిగించడం, మే: మోదీ సర్కార్కు ఆరో వార్షికోత్సవం, జూన్: బిహార్లో వర్చువల్ ర్యాలీ, జులై: రాజస్థాన్లో ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర’’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM