ఇది రాజకీయ బంద్ కాదు: శివసేన
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్కు భారీ మద్దతు వ్యక్తం అవుతోంది.
దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్కు భారీగా మద్దతు లభిస్తోంది. పలు రాజకీయ పార్టీలు రైతులకు బాసటగా నిలిచాయి. రైతులకు ఐక్యతను ప్రకటించడం, వారి మనోభావాలకు అనుగుణంగా మసలుకోవడం మన కర్తవ్యమని మంగళవారం శివసేన పార్టీ పేర్కొంది.
‘ఇది రాజకీయ బంద్ కాదు. ఇది మన సెంటిమెంట్. దిల్లీలో ఆందోళన చేస్తోన్న రైతులు ఏ జెండాను మోయడం లేదు. రైతులకు ఐక్యతను ప్రకటించడం, వారి మనోభావాలకు అనుగుణంగా మసలుకోవడం మన కర్తవ్యం. ఇక్కడ ఎటువంటి రాజకీయాలకు తావు లేదు. ఉండకూడదు కూడా. ప్రభుత్వానికి మనసుంటే, ప్రధాన మంత్రి, హోంమంత్రి..ఇద్దరిలో ఎవరో ఒకరు స్వయంగా రైతుల వద్దకు వచ్చి మాట్లాడాలి’ అని శివసేన పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ అన్నారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు గత 10 రోజులకు పైగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దిల్లీ శివారుల్లో తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రంతో జరిగిన చర్చలు విఫలం కావడం, చట్ట సవరణలకు కేంద్ర సూచించిన ప్రతిపాదనలతో సంతృప్తి చెందకపోవడంతో రైతు సంఘాలు శుక్రవారం భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్కు పలు రాజకీయ పార్టీలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మద్దతు ప్రకటించారు.
ఇవీ చదవండి:
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?