ఇది రాజకీయ బంద్ కాదు: శివసేన
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్కు భారీ మద్దతు వ్యక్తం అవుతోంది.
దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్కు భారీగా మద్దతు లభిస్తోంది. పలు రాజకీయ పార్టీలు రైతులకు బాసటగా నిలిచాయి. రైతులకు ఐక్యతను ప్రకటించడం, వారి మనోభావాలకు అనుగుణంగా మసలుకోవడం మన కర్తవ్యమని మంగళవారం శివసేన పార్టీ పేర్కొంది.
‘ఇది రాజకీయ బంద్ కాదు. ఇది మన సెంటిమెంట్. దిల్లీలో ఆందోళన చేస్తోన్న రైతులు ఏ జెండాను మోయడం లేదు. రైతులకు ఐక్యతను ప్రకటించడం, వారి మనోభావాలకు అనుగుణంగా మసలుకోవడం మన కర్తవ్యం. ఇక్కడ ఎటువంటి రాజకీయాలకు తావు లేదు. ఉండకూడదు కూడా. ప్రభుత్వానికి మనసుంటే, ప్రధాన మంత్రి, హోంమంత్రి..ఇద్దరిలో ఎవరో ఒకరు స్వయంగా రైతుల వద్దకు వచ్చి మాట్లాడాలి’ అని శివసేన పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ అన్నారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు గత 10 రోజులకు పైగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దిల్లీ శివారుల్లో తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రంతో జరిగిన చర్చలు విఫలం కావడం, చట్ట సవరణలకు కేంద్ర సూచించిన ప్రతిపాదనలతో సంతృప్తి చెందకపోవడంతో రైతు సంఘాలు శుక్రవారం భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్కు పలు రాజకీయ పార్టీలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మద్దతు ప్రకటించారు.
ఇవీ చదవండి:
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
Mayawati: డిసెంబర్లో తన రాజకీయ వారసుడిగా మాయావతి తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ను ప్రకటించారు. తాజాగా కీలక బాధ్యతల నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.