కొత్త ఓటర్లను ఆకర్షించండి: మాణికం ఠాగూర్‌

డీసీసీ అధ్యక్షులు నిరంతరం ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ సూచించారు.

Published : 28 Sep 2020 01:29 IST

హైదరాబాద్‌: డీసీసీ అధ్యక్షులు నిరంతరం ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ సూచించారు. ఇకపై ప్రతి నెలా డీసీసీ అధ్యక్షులతో సమావేశమవుతానని ఆయన స్పష్టం చేశారు. గాంధీభవన్లో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై వారితో చర్చించారు. జిల్లాల్లో పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెలా మండలస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించుకోవడంతో పాటు జిల్లా కార్యాలయాల నిర్వహణ కూడా సరిగా ఉండాలన్నారు. 

ప్రజలతో మమేకమై.. తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని మాణికం ఠాగూర్‌ సూచించారు. ప్రతి జిల్లా అధ్యక్షులు రెండేసి అసెంబ్లీ స్థానాలను గెలిపించాలని.. అప్పుడే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన దిశానిర్దేశం చేశారు. కొత్త ఓటర్లను పార్టీ వైపు ఆకర్షించేలా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని