ఈ దండలు మీ కోసమే: తేజస్వీ యాదవ్
మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో బిహార్లో ఎన్నికల ప్రచారానికి ఈ రోజు బ్రేక్ పడనుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి.
పట్నా: మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో బిహార్లో ఎన్నికల ప్రచారానికి ఈ రోజు బ్రేక్ పడనుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ఆర్జేడీ నేత, మహాకూటమా ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీయాదవ్ సోమవారం ఉదయం ట్విటర్లో ఉల్లిగడ్డల దండతో దర్శనమిచ్చారు. కూరగాయల ధరలు సామాన్యులను బాధిస్తున్న క్రమంలో కేంద్రంపై విమర్శలు చేస్తూ ఈ ఫొటోను షేర్ చేశారు.
‘ద్రవ్యోల్బణం, అవినీతి, నిరుద్యోగంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. వ్యాపారాలు, ఉపాధి పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. రైతులు, కార్మికులు, యువత, వ్యాపారులు.. వారి కనీస అవసరాలు తీర్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న వ్యాపారులను భాజపా చితికిపోయేలా చేసింది. అప్పుడు ఉల్లిగడ్డల ధర పెరిగినప్పుడు వారు ఆ దండలు వేసుకొని తెగ తిరిగారు. ఇప్పుడు మేం వారికి వాటిని ఇస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే మీడియాతో మాట్లాడుతూ..‘ఉల్లిగడ్డల ధర రూ.50 నుంచి రూ.60 మధ్యలో ఉన్నప్పుడు ధరల పెరుగుదల గురించి వారు మాట్లాడారు. ఇప్పుడు రూ.80 దాటినా వారు మాత్రం నిశ్శబ్దంగా ఉన్నారు. రైతులు నాశనమవుతున్నారు. యువత నిరుద్యోగంతో బాధపడుతున్నారు. బిహార్ పేదరికంతో ఉంది. ప్రజలు విద్య, ఉద్యోగాలు, వైద్య సహాయం కోసం వలస పోతున్నారు. ఆకలి తీవ్ర స్థాయిలో ఉంది’ అంటూ భాజపా, ఎన్డీఏ కూటమిపై మండిపడ్డారు. భారీ వర్షాలు, అవసరానికి మించి నిల్వ వంటి కారణాలతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉల్లి ధర రూ.100కు చేరుకొని సామాన్య ప్రజలను కన్నీరుపెట్టిస్తోంది. దాంతో దేశీయ సరఫరా పెంచి, వినియోగదారులకు ఊరట కల్పించే ఉద్దేశంతో వాటి నిల్వపై కేంద్రం పరిమితులు విధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!