మాకు ఎవరితోనూ పొత్తు లేదు: అసదుద్దీన్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు కుదుర్చుకోలేదని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు కుదుర్చుకోలేదని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర చేస్తూ అసదుద్దీన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే అభ్యర్థులను ఎన్నుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. భాజపాతో ఎంఐఎం కలిసిందని రాష్ట్ర మంత్రి జగదీష్రెడ్డి ఓ వైపు.. తెరాసతో పొత్తు పెట్టుకున్నామని కాంగ్రెస్ నేతలు మరోవైపు చేస్తున్న ఆరోపణలు ఆశ్చర్యాన్ని కలిగించాయన్నారు. గ్రేటర్ పోరులో ఇతర పార్టీలతో ఎలాంటి పొత్తు లేకుండా 52 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు అసదుద్దీన్ స్పష్టం చేశారు.
2019 ఎన్నికల తర్వాత రాష్ట్రానికి, ప్రత్యేకంగా హైదరాబాద్కు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించలేదని.. అందుకే అభివృద్ధి గురించి చెప్పుకొనే పరిస్థితి లేక ఎన్నికలకు మతం రంగులు పులుముతున్నారని అసదుద్దీన్ ఆక్షేపించారు. పశ్చిమ్ బంగాలో రాబోయే ఎన్నికల్లో తాము పోటీ చేయాలా? వద్దా? అనే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అక్కడి పార్టీ ప్రతినిధులతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కరోనా కారణంగా నిరుద్యోగులుగా మారిన లక్షలాది మందికి భరోసా కల్పించకుండా విద్వేషాలను రెచ్చగొడుతున్నారని అసదుద్దీన్ విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.