అమిత్‌షాతో విజయశాంతి భేటీ

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి భేటీ అయ్యారు. దిల్లీలోని ఆయన నివాసంలో

Updated : 27 Feb 2024 17:39 IST

దిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి భేటీ అయ్యారు. దిల్లీలోని ఆయన నివాసంలో అమిత్‌షాను కలిశారు. కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి ఆమె షా నివాసానికి వెళ్లారు. సోమవారం ఉదయం భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో విజయశాంతి కాషాయదళంలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వివిధ పార్టీలకు చెందిన మరికొంతమంది ముఖ్యనేతలు కూడా భాజపా తీర్థం పుచ్చుకోనున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు