బొత్స ఫోక్స్‌ వ్యాగన్‌ స్కాంను ప్రజలు మరచిపోలేదు

మంత్రి బొత్స ఫోక్స్‌ వ్యాగన్‌ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు.

Published : 10 May 2024 06:32 IST

భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి

ఈనాడు, అమరావతి: మంత్రి బొత్స ఫోక్స్‌ వ్యాగన్‌ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. ‘పచ్చ కామెర్ల వారికి లోకమంతా పచ్చగా ఉన్నట్లే అవినీతి చేసే వారికి అంతా అవినీతిమయంగానే కనిపిస్తుంది. విశాఖ రైల్వేజోన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూమి అనువుగా లేదు. జోన్‌కు రూ.వంద కోట్లకుపైగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే.. ఎందుకు రాష్ట్రం అందిపుచ్చుకోలేదు? పసలేని ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమో మంత్రి బొత్స ఆలోచించుకోవాలి. ఆయన ఫోక్స్‌ వ్యాగన్‌ స్కాం గురించి ప్రజలకు ఇంకా గుర్తుంది’ అని పురందేశ్వరి గురువారం ఓ ప్రకటనలో మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని