జగన్‌ తిహాడ్‌ జైలుకు వెళ్లడం ఖాయం

వివేకాను జగన్‌మోహన్‌రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్‌ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు.

Published : 10 May 2024 06:41 IST

వివేకా హత్య కేసులో అప్రూవర్‌ దస్తగిరి

ఈనాడు, కడప: వివేకాను జగన్‌మోహన్‌రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్‌ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. వివేకాను హత్య చేయడానికి ముందు జగన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు. ‘మనవాళ్లు చెప్పినట్లు చెయ్యు.. నేను చూసుకుంటాను’ అని జగన్‌ భరోసా ఇవ్వడంతోనే హత్య చేయడానికి అంగీకరించినట్లు వివరించారు. వివేకా హత్యకు కారణాలను గురువారం ఆయన ‘ఈనాడు-ఈటీవీ’కి వివరించారు. వివేకాను చంపినవారు దర్జాగా బయట తిరుగుతున్నారని జగన్‌ చెప్పడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. తన చిన్నాన్నను చంపినోళ్లకు శిక్ష వేయించాల్సిన జగనే.. నిందితులను దగ్గర పెట్టుకుని కాపాడుతున్నారని విమర్శించారు. సామాన్యుడు సైతం సీఎంను ఎదురించగలడనే సంకేతం ఇచ్చేందుకే పులివెందుల నుంచి జై భీంరావు పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తాను ఎన్నికల ప్రచారం చేయకుండా వైకాపా నేతలు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. పులివెందుల కోటలు బద్దలు కొట్టే రోజులు దగ్గర పడ్డాయని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని