తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్‌ చట్టం ఒక్కటే

తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ తీసుకొచ్చిన జగన్‌కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.

Published : 10 May 2024 06:32 IST

సీపీఐ నారాయణ

తిరుపతి (నగరం), న్యూస్‌టుడే: తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ తీసుకొచ్చిన జగన్‌కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. గురువారం తిరుపతిలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాజధాని రైతుల చేతుల్లో 30 వేల ఎకరాల భూములుంటే ఏటా లక్షల కోట్ల ఆదాయం వచ్చేదని గుర్తుచేశారు. అనంతరం తమ పార్టీ అభ్యర్థి మురళి తరఫున నగరంలో నారాయణ రోడ్డుషో నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని