Politics: మోదీకి పట్నాయక్ 8 రేటింగ్ ఇస్తే.. భాజపా మాత్రం నవీన్కు 0 ఇచ్చింది!
ఒడిశాలో అధికార బిజద, విపక్షాల మధ్య రేటింగ్ లొల్లి మొదలయ్యింది. మోదీకి సీఎం 8 రేటింగ్ ఇస్తే.. భాజపా మాత్రం నవీన్ పట్నాయక్కు సున్నా రేటింగ్ ఇచ్చింది.
భువనేశ్వర్: పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. ఒడిశాలో అధికార బిజు జనతాదళ్ (BJD), భాజపా మధ్య పోటాపోటీ నెలకొంది. అయినప్పటికీ.. ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) ఇటీవల ప్రశంసల జల్లు కురిపించారు. ఈ క్రమంలో మోదీ (Narendra Modi) పనితీరుకు 10కి 8 రేటింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. అయితే పట్నాయక్పై మాత్రం రాష్ట్ర భాజపా భిన్నంగా స్పందించింది. రాష్ట్రంలో బిజద పనితీరుకు 0 రేటింగ్ ఇస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం.
ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అనేక సందర్భాల్లో మద్దతుగా నిలుస్తూనే ఉన్నారు. ఇటీవల కేంద్రంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాసం సమయంలోనూ భాజపాకు మద్దతిచ్చారు. ఈ నేపథ్యంలో భువనేశ్వర్లో తాజాగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. ప్రధాని మోదీపై ప్రశంసలు గుప్పించారు. విదేశీ విధానంపై మోదీ ప్రభుత్వానికి 10కి 8 మార్కులు ఇస్తున్నట్లు చెప్పిన ఆయన.. పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నారని కొనియాడారు.
ఏపీ రాజకీయాలతో మాకేంటి సంబంధం?
రాష్ట్ర భాజపా మాత్రం నవీన్ పట్నాయక్ పాలనపై మండిపడింది. ప్రధాని మోదీ పనితీరుకు ముఖ్యమంత్రి 10 మార్కులు ఇవ్వాల్సి ఉందని విపక్ష నేత (భాజపా) జయ్నారాయణ్ మిశ్రా పేర్కొన్నారు. అయినప్పటికీ పట్నాయక్ పనితీరుకు మాత్రం తాను 0 రేటింగ్ ఇస్తున్నానని అన్నారు. మోదీ అవినీతిరహిత పాలన అందిస్తుంటే.. పట్నాయక్ ప్రభుత్వం మాత్రం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఇదే వ్యవహారంపై స్పందించిన రాష్ట్ర కాంగ్రెస్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడింది. ప్రజల కోసం రెండు పార్టీలు ఏమీ చేయలేదని.. వారికి 0 మార్కులు ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహినీపతి విమర్శించారు.
అయితే, మిశ్రా, బాహినీపతి వంటి వారి రేటింగ్ నవీన్ పట్నాయక్కు అవసరం లేదని.. ఒడిశా ప్రజలే ఆయనకు ఫుల్ మార్కులు ఇస్తారని అధికార బిజద ఎమ్మెల్యే శశిభూషణ్ బెహేరా పేర్కొన్నారు. అందుకే ఐదు పర్యాయాలుగా ఆయనే ముఖ్యమంత్రి అవుతున్నారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Dhulipalla Narendra: రాజకీయ లబ్ధి కోసమే జగన్ నీటి చిచ్చు పెట్టారు: ధూళిపాళ్ల నరేంద్ర
రాష్ట్ర నీటి హక్కుల ముసుగులో స్వార్థ ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా సాగర్పై దండయాత్ర చేశారని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర (Dhulipalla Narendra) ఆరోపించారు. -
Payyavula Keshav: ఫారం-7 గంపగుత్త అప్లికేషన్లు తీసుకోవడానికి వీల్లేదు: పయ్యావుల
ఓట్లు తొలగించేందుకు ఫారం-7 ద్వారా గంపగుత్త అప్లికేషన్లకు వీల్లేదని ఈసీ ఇచ్చిన ఆదేశాలు తాము చేస్తున్న పోరాటానికి స్పష్టత ఇచ్చినట్లు అయ్యిందని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. -
Gutha Sukender Reddy: దురాలోచనతోనే ఏపీ ప్రభుత్వం ‘సాగర్’ దుశ్చర్య: గుత్తా
తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజు సాగర్ డ్యామ్పైకి ఏపీ పోలీసులు దౌర్జన్యంగా వచ్చారని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దురాలోచనతోనే ఏపీ ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడిందని ఆరోపించారు. -
Rahul Gandhi: వచ్చే పదేళ్లలో 50% మహిళా సీఎంలే ఉండేలా పనిచేద్దాం: రాహుల్
కాంగ్రెస్ సంస్థాగత పదవుల్లో మహిళల పాత్రను గణనీయంగా పెంచేందుకు క్రియాశీలంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. -
కేసీఆర్తో జగన్ దోస్తీ ఆస్తులు కాపాడుకోవడానికేనా?
తెలంగాణలో తనకున్న ఆస్తులను కాపాడుకోవడానికే సీఎం జగన్ కేసీఆర్తో దోస్తీ చేస్తున్నారా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. -
Pawan Kalyan: తెదేపాతో పొత్తుపై నోరు జారితే సహించను
‘జనసేన తెదేపా పొత్తుపై వ్యతిరేకంగా ఏ స్థాయి నాయకులు మాట్లాడినా, చిన్న కార్యకర్త మాట్లాడినా ఊరుకునేది లేదు. అలాంటివారిని వైకాపా కోవర్టులుగా భావిస్తాం. గట్టి చర్యలు తీసుకుంటాం. -
ప్రజల్లోకి ఎప్పుడు, ఎలా వస్తానో త్వరలో చెబుతా
-
కోడికత్తిలా నాగార్జునసాగర్ డ్రామా
ఎప్పుడూ లేని కరవు రాష్ట్రాన్ని వెంటాడుతోందని, రైతులు తీవ్రంగా నష్టపోతుంటే ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్లో హాయిగా ఉన్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. -
కొప్పుల ఈశ్వర్పై ఎన్నికల పిటిషన్ కొట్టివేత
జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. -
స్వప్రయోజనాలకే కృష్ణా జలాల తాకట్టు
తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి, బాబాయ్ హత్య కేసు నుంచి అవినాష్రెడ్డిని కాపాడటానికి.. కృష్ణా జలాల్ని పక్క రాష్ట్రానికి సీఎం జగన్ ధారాదత్తం చేశారని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. -
బినామీలకు ఎసైన్డ్ భూములు కట్టబెట్టే కుట్ర
గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వేల ఎకరాల ఎసైన్డ్ భూములను ధరణిలో తప్పుగా నమోదుచేయించి, ప్రభుత్వ పెద్దల బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించేందుకు భారాస నేతలు కసరత్తు చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. -
‘యువగళం’.. వైకాపా పతనానికి నాంది
తెదేపా అధినేత చంద్రబాబుపై తెలంగాణ సీఎం కేసీఆర్ అవలంబించిన వైఖరే ఆ రాష్ట్రంలో భారాస పార్టీ గడ్డు పరిస్థితికి కారణమని జై భారత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జి.చిన్నయ్య దొర విమర్శించారు. -
జల వివాదం కేసీఆర్, జగన్ల ఎత్తుగడ: కోదండరాం
ప్రభుత్వ నిరంకుశ పాలనపై ఓటు హక్కు ద్వారా ప్రజలు తిరుగుబాటు చేశారని, ఆ మేరకు ఎన్నికల ఫలితాలు రానున్నాయని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. -
రాష్ట్రంలో జగన్ పీనల్ కోడ్
రాష్ట్రంలో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో జగన్ పీనల్ కోడ్ అమలవుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
10 నుంచి చంద్రబాబు జిల్లా పర్యటనలు!
తెదేపా అధినేత చంద్రబాబు త్వరలో పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నం కానున్నారు. ఈ నెల 10 నుంచి జిల్లాల పర్యటనలకు వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Animal: రణ్బీర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్.. ‘యానిమల్’ ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే!
-
Dhulipalla Narendra: రాజకీయ లబ్ధి కోసమే జగన్ నీటి చిచ్చు పెట్టారు: ధూళిపాళ్ల నరేంద్ర
-
Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదలకు ఈసీ అనుమతి
-
Chess: ఒకే ఇంటి నుంచి ఇద్దరు గ్రాండ్ మాస్టర్లు.. ప్రజ్ఞానంద-వైశాలి అరుదైన ఘనత
-
Mike Tyson: ‘ఆ పంచ్ దెబ్బలకు రూ.3 కోట్లు ఇవ్వండి’.. మైక్ టైసన్ను డిమాండ్ చేసిన బాధితుడు
-
Rohit - Hardik: రోహిత్-హార్దిక్ విషయంలో సెలక్టర్లకు కఠిన సవాల్ తప్పదు: నెహ్రా