తమిళనాట 20 స్థానాల్లో భాజపా బరిలోకి!
తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా భాజపా, అన్నాడీఎంకేల మధ్య సీట్ల పంపకాల చర్చలు కొలిక్కివచ్చాయి. పొత్తులో భాగంగా భాజపాకు అధికార అన్నాడీఎంకే 20 స్థానాలు కేటాయించేందుకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇరు పార్టీలు శుక్రవారం రాత్రి ప్రకటించాయి
చెన్నై: తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా భాజపా, అన్నాడీఎంకేల మధ్య సీట్ల పంపకాల చర్చలు కొలిక్కివచ్చాయి. పొత్తులో భాగంగా భాజపాకు అధికార అన్నాడీఎంకే 20 స్థానాలు కేటాయించేందుకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇరు పార్టీలు శుక్రవారం రాత్రి ప్రకటించాయి. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై ఇరు పార్టీల సీనియర్ నేతలు సంతకాలు చేశారు. అన్నాడీఎంకే తరపున పార్టీ కోఆర్డినేటర్, డిప్యూటీ సీఎం పన్నీర్సెల్వం, సీఎం ఈ పళనిస్వామి, భాజపా తరపున రాష్ట్ర ఇన్ఛార్జి సీటీ రవి, స్టేట్ యూనిట్ చీఫ్ మురుగన్ సంతకం చేశారు. మరో ప్రాంతీయ పార్టీ అయిన పీఎంకేకు పొత్తులో భాగంగా అన్నాడీఎంకే 23 స్థానాలు కేటాయించింది.
అయితే భాజపా పోటీ చేయబోయే స్థానాల పేర్లపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు ఇటీవల కాంగ్రెస్ ఎంపీ వసంతకుమార్ మరణంతో ఖాళీ అయిన కన్యాకుమారి లోక్సభ స్థానాన్ని సైతం భాజపాకే కేటాయించారు. ఇదిలా ఉండగా.. పొత్తులో భాగంగా నటుడు విజయ్కాంత్కు చెందిన డీఎండీకే పార్టీకి స్థానాల కేటాయింపుపై అన్నాడీఎంకే తుది ప్రకటన చేయాల్సి ఉంది.
ఆరుగురితో తొలి జాబితా విడుదల
అన్నాడీఎంకే ఇప్పటికే ఆరుగురు సభ్యులతో తొలి జాబితా ప్రకటించింది. ఆ ఆరుగురిలో సీఎం పళనిస్వామి ఎడప్పాడి నుంచి, పన్నీర్సెల్వం బోడినయకనూర్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. మరో ఇద్దరు సీనియర్ మంత్రులు జయకుమార్, షణ్ముగమ్లు రాయపురమ్, విలుపురమ్ నుంచి బరిలో దిగనున్నారు.
కాగా, తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. మొత్తం 234 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం