
యోగితో శివపాల్ యాదవ్ భేటీ.. అఖిలేశ్తో బంధానికి ‘ఎండ్’కార్డ్ పడినట్లేనా..?
లఖ్నవూ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన సమాజ్వాదీ పార్టీకి మరో సమస్య ఎదురైంది. ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్.. ఆయన బాబాయి శివపాల్ యాదవ్ మధ్య మళ్లీ విభేదాలు భగ్గుమన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎస్పీ కూటమితో శివపాల్ బంధం తెంచుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన భాజపాలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
అఖిలేశ్, శివపాల్ మధ్య 2016లో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. శివపాల్ను అఖిలేశ్ తన కేబినెట్ నుంచి తప్పించడం.. ఆ తర్వాత శివపాల్ పార్టీ నుంచి విడిపోవడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామాలు 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించాయి. ఆ ఎన్నికల్లో శివపాల్ సొంతంగా పోటీ చేశారు. అయితే ఇటీవల 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీరిద్దరూ పాత విభేదాలను పక్కనబెట్టి చేతులు కలిపారు. శివపాల్ తన పార్టీని ఎస్పీలో కలుపుతున్నట్లు ప్రకటించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ శివపాల్ ఎస్పీ గుర్తుపైనే పోటీ చేశారు.
అయితే ఇటీవల సమాజ్వాదీ పార్టీ నూతన ఎమ్మెల్యేలు సమావేశమై అఖిలేశ్ యాదవ్ను శాసనసభ ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి శివపాల్ యాదవ్ను ఆహ్వానించలేదు. ఈ విషయమై శివపాల్.. అఖిలేశ్ను ప్రశ్నించగా.. సమాజ్వాదీ పార్టీ మిత్రపక్షాలతో తాను త్వరలోనే సమావేశమవుతానని చెప్పినట్లు సమాచారం. ఇక మార్చి 24న శివపాల్.. అఖిలేశ్ను కలిసి ఎస్పీలో కీలక పాత్ర (ప్రతిపక్ష నేతగా) ఇవ్వమని కోరినట్లు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. అయితే దీనికి అఖిలేశ్ అంగీకరించలేదు సరికదా.. ‘‘మీరు మా మిత్రపక్షం మాత్రమే. సమాజ్వాదీ పార్టీ సభ్యులు కాదు’’ అని చెప్పినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిణామాలతో శివపాల్ అసంతృప్తికి లోనైనట్లు తెలిపాయి.
యోగితో భేటీ.. ఆంతర్యమేంటీ..?
మరోవైపు శివపాల్.. సీఎం యోగి ఆదిత్యనాథ్ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం లఖ్నవూలోని సీఎం నివాసానికి వెళ్లిన శివపాల్ ఆయనతో 20 నిమిషాల పాటు చర్చించారు. ఈ భేటీపై శివపాల్ మాట్లాడనప్పటికీ.. మర్యాద పూర్వకంగానే కలిసినట్లు ఆయన పార్టీ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆయన త్వరలోనే భాజపాలో చేరుతారని ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే ములాయం చిన్న కోడలు అపర్ణ యాదవ్ అసెంబ్లీ ఎన్నికల ముందు భాజపాలో చేరిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Health: ఆహారం కలుషితమై వాంతులు, విరేచనాలా..? అయితే ఇలా చేయండి..!
-
General News
Offbeat: క్షమాపణ కోరుతూ సోదరుడికి 434 మీటర్లు, 5 కేజీల లేఖ.. ఏం జరిగిందంటే..?
-
Movies News
Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
-
World News
Senegal: సమద్రంలో బోటు బోల్తా.. 13 మంది మృతి, 40మంది గల్లంతు!
-
General News
Health: కాలేయం మార్పిడి ఎప్పుడు అవసరమో తెలుసా..?
-
Crime News
Prayagraj: కుమార్తె మృతదేహంతో ఐదు రోజులుగా ఇంట్లోనే.. బతికించేందుకు క్షుద్రపూజలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Actress Meena: మీనా భర్త మృతి.. పావురాల వ్యర్థాలే కారణమా..?
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- IND vs IRE : అందుకే ఆఖరి ఓవర్ను ఉమ్రాన్కు ఇచ్చా : హార్దిక్ పాండ్య
- DilRaju: తండ్రైన దిల్రాజు.. మగబిడ్డకు జన్మనిచ్చిన తేజస్విని
- Udaipur Murder: భగ్గుమన్న ఉదయ్పుర్
- ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!
- Hema Chandra - Sravana Bhargavi: విడాకుల వార్తలపై హేమచంద్ర, శ్రావణ భార్గవి క్లారిటీ
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)