ప్రజల చేతిలో డబ్బు పెట్టడమే పరిష్కారం..!
ప్రస్తుత సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే ప్రజల చేతిలో డబ్బు ఉండేలా చేయడమే పరిష్కారమని కాంగ్రెస్ అగ్రనేత పి.చిదంబరం పేర్కొన్నారు.
దిల్లీ: ప్రస్తుత సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే ప్రజల చేతిలో డబ్బు ఉండేలా చేయడమే పరిష్కారమని కాంగ్రెస్ నేత పి.చిదంబరం పేర్కొన్నారు. కొవిడ్తో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు సోమవారం కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై మంగళవారం చిదంబరం ట్విటర్ వేదికగా స్పందించారు. రుణ హామీ ఎప్పటికీ నేరుగా అప్పు ఇచ్చినట్టు కాదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే అప్పులతో నెట్టుకొస్తున్న వ్యాపార సంస్థలకు రుణాలు ఇచ్చేందుకు ఏ బ్యాంకూ ముందుకు రాదని వివరించారు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన వ్యాపార సంస్థలు మరిన్ని అప్పులు చేయాలనుకోవని తెలిపారు. వారికి రుణం కాని మూలధనం అవసరమన్నారు. ఉత్పత్తులను ఎక్కువ సరఫరా చేస్తే ప్రజలు ఎక్కువ వినియోగిస్తారని అర్థం చేసుకోవద్దని తెలిపారు. డిమాండ్ పెంచితేనే ఎక్కువ సరఫరా చేయాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు. పేద, దిగువ మధ్యతరగతి ప్రజల చేతుల్లో డబ్బు పెట్టడం ద్వారా డిమాండ్ పెంచడమే ఈ సంక్షోభానికి సమాధానం అని ఆయన వెల్లడించారు. నిరుద్యోగం, వేతనాల తగ్గుదలకు దారితీసిన ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెంచడం అంత సులువైన పని కాదన్నారు.
కొవిడ్ కారణంగా తలెత్తిన సంక్షోభం నుంచి ఆర్థికవ్యవస్థను గట్టెక్కించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం రూ.1.5 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీ ద్వారా చిన్న, మధ్య తరహా వ్యాపారులకు రుణ సదుపాయం పెంచడంతోపాటు, ఆరోగ్య రంగానికి మరిన్ని నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. పర్యాటక ఏజెన్సీలు, గైడ్లకు రుణాలు, ఇవ్వడంతోపాటు విదేశీ పర్యాటకులకు వీసా రుసుము మాఫీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.