Himanta Sarma: రాహుల్ గాంధీపై అస్సాం సీఎం తీవ్ర వ్యాఖ్యలు!
భాజపా తరఫున ఉత్తరాఖండ్లో ప్రచారంలో భాగంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శుక్రవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇక్కడి ఓ సభలో ఆయన ప్రసంగిస్తూ.. ‘2016లో భారత సైన్యం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్పై ఆధారాలు...
ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్, వ్యాక్సిన్ల గురించి రాహుల్ గతంలో చేసిన వ్యాఖ్యలకు స్పందనగా.. తామెప్పుడైనా రాహుల్ పుట్టుక గురించి ప్రశ్నించామా? అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్లో భాజపా తరఫున ప్రచారంలో భాగంగా శుక్రవారం ఇక్కడి ఓ సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ విమర్శలు చేశారు.
‘‘2016లో భారత సైన్యం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్పై రాహుల్ ఆధారాలు అడిగారు. రాహుల్ వ్యక్తిగత విషయాలపై తామెప్పుడైనా ఇలా అడిగామా? పాక్ భూభాగంలో సర్జికల్ చేపట్టారని మన సైనికులు చెబితే.. అదే ఫైనల్. దానికి ఆధారాలు కావాలంటూ సైన్యాన్ని ప్రశ్నించే హక్కు ఎవరిచ్చారు’’ అంటూ హిమంత రాహుల్పై ధ్వజమెత్తారు. ఈ విషయంలో సైనికులను కించపరచవద్దని సూచించారు. హిజాబ్ వివాదంపైనా స్పందిస్తూ.. పాఠశాలలు, కళాశాలల్లో కేవలం యూనిఫాంను మాత్రమే అనుమతించాలన్నారు. ఇది విద్యార్థుల మధ్య సమానత్వాన్ని, గౌరవాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. ముస్లిం విద్యార్థినులు చదువుకొని వైద్యులు, ఇంజినీర్లు కావాలనుకుంటున్నారని.. కానీ, కాంగ్రెస్ మాత్రం వారు హిజాబ్ వివాదంలోనే బిజీగా ఉండాలని చెబుతోందన్నారు.
అంతకుముందు దేశ సమాఖ్యపై రాహుల్ గాంధీ చేసిన ఓ ట్వీట్పైనా హిమంత ఘాటుగా స్పందించారు. కశ్మీర్ నుంచి కేరళ వరకు, గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు భారత్ అన్నింటా అద్భుతమైనదంటూ రాహుల్ అందులో పేర్కొనగా.. పశ్చిమ బెంగాల్ దాటి ఈశాన్య భారతం కూడా ఉందంటూ హిమంత బదులిచ్చారు. మీ ‘తుక్డే తుక్డే ఫిలాసఫీ’కి దేశాన్ని తాకట్టు పెట్టలేమన్నారు. అసలు జాతీయతతో మీ సమస్య ఏంటని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం