AP News: పార్టీ ప్రచారానికి ప్రజాధనం వినియోగిస్తారా?: అచ్చెన్న

సీఎం జగన్‌ కోసం రెండు హెలికాఫ్టర్లు అద్దెకు తీసుకోవడంపై తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Published : 26 Feb 2024 22:13 IST

అమరావతి: సీఎం జగన్‌ కోసం రెండు హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడంపై తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి లేఖ రాశారు. ‘‘రెండు హెలికాప్టర్లకు రూ.3.84 కోట్ల ప్రజాధనం వృథా చేస్తారా? పార్టీ ప్రచారానికి ప్రజాధనం దుర్వినియోగం చేయడం దుర్మార్గం. ఎన్నికల వేళ ఈ నిర్ణయం నియమావళిని ఉల్లంఘించడమే. ఈ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలి’’ అని సీఎస్‌కు రాసిన లేఖలో అచ్చెన్న కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని