Guntur: గుంటూరులో వైకాపా కార్యాలయంపై మందుబాబుల దాడి

నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో మందుబాబులు వీరంగం సృష్టించారు. వైకాపా కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు. 

Updated : 01 Jan 2024 11:23 IST

గుంటూరు: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో మందుబాబులు వీరంగం సృష్టించారు. చంద్రమౌళి నగర్‌లోని వైకాపా కార్యాలయంపై రాళ్లు రువ్వారు. దీంతో కార్యాలయ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇటీవలే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైకాపా ఇంఛార్జిగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని (Vidadala Rajini) నియమితులయ్యారు. కొత్త ఏడాదిని పురస్కరించుకుని కార్యాలయం ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. అయితే అర్ధరాత్రి  కొంతమంది దుండగులు కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి గుంపును చెదరగొట్టారు. ఇప్పటివరకు దాదాపు 50 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, ఈ దాడి ఘటనను మంత్రి రజిని ఖండించారు. అనంతరం కార్యాలయాన్ని ఆమె పరిశీలించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని