మళ్లీ ఎన్నికల బరిలోకి బబితా ఫొగాట్!
ప్రముఖ రెజ్లింగ్ ఛాంపియన్ బబితా ఫొగాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హరియాణా క్రీడా శాఖలో తన డిప్యూటీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అనివార్య పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం క్రీడా శాఖకు సమర్పించిన రాజీనామా లేఖలో ఆమె పేర్కొన్నారు.
చండీగఢ్: ప్రముఖ రెజ్లింగ్ ఛాంపియన్ బబితా ఫొగాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హరియాణా క్రీడా శాఖలో తన డిప్యూటీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అనివార్య పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం క్రీడా శాఖకు సమర్పించిన రాజీనామా లేఖలో ఆమె పేర్కొన్నారు. రాజీనామా అనంతరం బబిత మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను ఇటీవల రాష్ట్ర క్రీడా విభాగంలో డిప్యూటీ డైరెక్టర్గా చేరాను. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల పదవికి రాజీనామా చేశాను. ఇక నుంచి భాజపా తరపున రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలనుకుంటున్నాను. బరోడా నియోజకవర్గంలో రాబోయే ఉపఎన్నికల్లో ప్రచారంలోనూ పాల్గొంటాను’ అని వెల్లడించారు. హరియాణాలోని బరోడా నియోజకవర్గానికి నవంబర్ 3న జరగనున్న ఉపఎన్నికకు భాజపా తరపున బబిత పోటీ చేయనున్నట్లు అక్కడ ఊహాగానాలు వస్తున్నాయి. మరోవైపు ఆమె బుధవారం హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశం అయ్యారు.
బబితా ఫొగాట్ గతేడాది ఆగస్టులో తన తండ్రితో కలిసి భాజపాలో చేరిన విషయం తెలిసిందే. పార్టీలో చేరిక సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీకి తాను పెద్ద అభిమానినని చెప్పారు. దేశం కోసం కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు, పథకాలు నచ్చి భాజపాలో చేరుతున్నట్లు వెల్లడించారు. హరియాణాలో చివరి శాసనసభ ఎన్నికల్లో దాద్రి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.