Balineni Srinivasa Reddy: బాలినేని జనసేనకు వెళ్తున్నారా? క్లారిటీ ఇచ్చిన మాజీమంత్రి
పార్టీలో సమన్వయం కోసం పనిచేస్తున్నానని.. అందుకే గిద్దలూరు నియోజకవర్గ వైకాపా నేతలతో సమావేశం ఏర్పాటు చేశానని ఆ పార్టీ సీనియర్ నేత..
ఒంగోలు: పార్టీలో సమన్వయం కోసం పనిచేస్తున్నానని.. అందుకే గిద్దలూరు నియోజకవర్గ వైకాపా నేతలతో సమావేశం ఏర్పాటు చేశానని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. తాను జనసేనకు వెళ్తున్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని.. అందుకే ఈ సమావేశం ఏర్పాటుచేసినట్లు వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతల గురించి జనసేన అధినేత పవన్కల్యాణ్ ట్వీట్ చేస్తే మద్దతు ప్రకటించానని బాలినేని చెప్పారు. చేనేత కార్మికుల కోసం గతంలో చాలా కార్యక్రమాలు చేశామని.. ఇప్పడూ చేస్తున్నామని తెలిపారు. వైకాపా రీజినల్ కోఆర్డినేటర్గా 22 నియోజకవర్గాల బాధ్యతలు తనకు అప్పగించారని.. అక్కడ గెలుపుకోసం కృషి చేస్తానని చెప్పారు. ఊసరవెల్లి రాజకీయాలు చేయనన్నారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ఆర్ అని.. ఎన్నికష్టాలు ఉన్నా సీఎం జగన్ వెంటే ఉంటానని బాలినేని స్పష్టం చేశారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్తోనే ఉంటానని.. వేరే పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’