Hyderabad: జాతీయపార్టీ లేకుండా ప్రాంతీయ పార్టీల కూటమి అసాధ్యం: ఈటల
ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబయి పర్యటనకు వెళ్లారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు.
హైదరాబాద్: ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబయి పర్యటనకు వెళ్లారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. జాతీయ పార్టీ లేకుండా ప్రాంతీయ పార్టీల కూటమి సాధ్యం కాదని అయన స్పష్టం చేశారు. గవర్నర్ తమిళిసైను మేడారంలో అవమాన పరిచారని మండిపడ్డారు. సంస్కార హీనమైన సంప్రదాయానికి సీఎం తెర తీశారని అగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజున ప్రధాని మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారని గుర్తు చేస్తూ.. వ్యక్తులు కాదు, వ్యవస్థలు ముఖ్యమని అన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు తాత్కాలిక విజయాన్ని మాత్రమే ఇస్తాయని మంత్రి కేటీఆర్ తెలుసుకోవాలన్నారు. భాజపా కార్యకర్తలపై దాడులు కొనసాగుతాయని కేటీఆర్ చిల్లర వ్యాఖ్యలు చేశారన్నారు. వీఆర్వోలను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెడుతోందన్నారు. ఉద్యోగ నియామకాలపై కేసీఆర్కు చిత్తశుద్ధి లేదని, ఉద్యోగాల భర్తీ లేక యువకులు వివాహం చేసుకోవడం లేదని ఈటల ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434