BRS-BJP: భారాస ఎమ్మెల్యే ఆఫీస్ ముట్టడికి భాజపా యత్నం.. హనుమకొండలో ఉద్రిక్తత
హనుమకొండలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని కోరుతూ భాజపా హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే విజయ్భాస్కర్ క్యాంపు కార్యాలయం ముట్టడికి బయలుదేరిన భాజపా నాయకులు, కార్యకర్తలను హంటర్ రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
వరంగల్ (నేరవార్తలు): హనుమకొండలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని కోరుతూ భాజపా హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే విజయ్భాస్కర్ క్యాంపు కార్యాలయం ముట్టడికి బయలుదేరిన భాజపా నాయకులు, కార్యకర్తలను హంటర్ రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, భాజపా నాయకులు, కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఇరు వర్గాల కార్యకర్తలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. దీంతో కొంత మంది భాజపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. అనంతరం భాజపా హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మను పోలీసులు బలవంతంగా వాహనంలోకి ఎక్కించేందుకు ప్రయత్నించగా.. ఆమె సొమ్మసిల్లి కింద పడిపోయారు. పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం హనుమకొండలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం రావు పద్మతోపాటు భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎ. రాకేశ్రెడ్డిని నగర శివారులోని ఠాణాకు తరలించారు.
కరీంనగర్లో మంత్రి ఇంటి ముట్టడికి యత్నం..
మరోవైపు కరీంనగర్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల హామీలు నెరవేర్చాలన్న డిమాండ్తో భాజపా శ్రేణులు.. మంత్రి ఇంటి ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. వారు ప్రతిఘటించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనలు చేపట్టకుండా ముందస్తుగానే కొంత మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయినప్పటికీ మరికొందరు మంత్రి ఇంటి ముట్టడికి యత్నించారు. వీరిని అదుపులో తీసుకునే క్రమంలో రోడ్డుపై బైఠాయించారు. కొందరు కార్యకర్తలు గేటు దూకి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి.. వైకాపా కండువా వేసుకుంటే బెటర్: వర్ల రామయ్య
వైకాపా మూకలకు సహకరించి డీఎస్పీ చైతన్య... పోలీసు దుస్తులు తీసేసి, వైకాపా కండువా వేసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గం: సీపీఐ
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం కావడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. -
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్: పాతూరి నాగభూషణం
ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
‘దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని భారాస నేతలు డిమాండ్ చేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ