Farooq Abdullah: ‘ఆ పంచాయతీ ఎన్నికల్ని బహిష్కరించడం పెద్ద తప్పిదమే..!’
జమ్మూ- కశ్మీర్లో 2018 పంచాయతీ ఎన్నికలను బహిష్కరించడం తాము చేసిన పెద్ద తప్పిదమని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) వ్యాఖ్యానించారు. ఇకముందు స్థానికంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. తమ పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందన్నారు.
శ్రీనగర్: జమ్మూ- కశ్మీర్లో 2018 పంచాయతీ ఎన్నికల్ని బహిష్కరించడం తాము చేసిన పెద్ద తప్పిదమని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) వ్యాఖ్యానించారు. ఇకముందు స్థానికంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. తమ పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందన్నారు. అయితే, ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వం, భద్రతా దళాలు మాత్రం జోక్యం చేసుకోవద్దంటూ హెచ్చరించారు.
‘పార్టీ(National Conference) శ్రేణులకు ఒక్కటే చెబుతున్నా. అప్పట్లో (2018లో) పంచాయతీ ఎన్నికలను బహిష్కరించడం పెద్ద తప్పిదం. భవిష్యత్తులో వచ్చే ఏ ఎన్నికలనూ బహిష్కరించం. అందుకు బదులుగా పోటీ చేసి గెలుస్తాం’ అని ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేతగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన.. సోమవారం పార్టీ నేతలు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.
జమ్మూ- కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నంత కాలం తాను ఎన్నికల్లో పోటీ చేయనంటూ కుమారుడు ఒమర్ అబ్దుల్లా చేసిన ప్రకటనపై స్పందించిన ఆయన.. ‘పార్టీ అధ్యక్షుడిగా చెబుతున్నా. నువ్వు(ఒమర్ అబ్దుల్లా) ఎన్నికల్లో నిలబడాల్సిందే’ అని స్పష్టం చేశారు. ప్రత్యర్థులను ఓడించాలంటే.. పార్టీ శ్రేణులంతా రంగంలోకి దూకి, ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుందన్నారు.
ఎన్నికలు, అధికారం విషయంలో భాజపా ఏదైనా చేస్తుందని ఆరోపించిన ఫరూక్.. పార్టీ విధేయులనూ కొనే ప్రయత్నం చేస్తుందన్నారు. అయినప్పటికీ.. వారి ప్రయత్నాలన్నీ విఫలమవుతాయని చెప్పారు. ఎన్నికల ప్రక్రియలో భద్రతా బలగాలు, ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని చెబుతూ.. ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకునే అధికారం ప్రజలకే ఇవ్వాలన్నారు. ఒకవేళ అలాంటిదే జరిగితే ఆందోళనలు చేపడతామని, ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోమన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.