Andhra News: సీఎం కాన్వాయ్కు కార్లు పెట్టుకోలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్కు కార్లు పెట్టిన వారికి బిల్లులు చెల్లించకపోవడం
కుప్పం: ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్కు కార్లు పెట్టిన వారికి బిల్లులు చెల్లించకపోవడం రాష్ట్ర దుస్థితికి నిదర్శనమన్నారు. సీఎం, మంత్రులు, ప్రముఖుల కాన్వాయ్లకు కార్లు పెట్టిన వారికి రూ.17.5 కోట్ల బకాయిలను మూడేళ్లుగా ప్రభుత్వం బాకీ పడిన వైనంపై చంద్రబాబు స్పందించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రెండో రోజు పర్యటనలో ఉన్న చంద్రబాబు ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కనీసం సీఎం కాన్వాయ్కు కార్లు కూడా పెట్టుకోలేని స్థితిలో రాష్ట్రం ఉండడం అవమానకరం అని మండిపడ్డారు. ఈ మొత్తం అంశాన్ని ఒక శాఖలో పెండింగ్ బిల్లుల అంశంగా మాత్రమే చూడకూడదని.. ఇది రాష్ట్ర ఆర్థిక నిర్వహణకు, వ్యవస్థల ధ్వంసానికి అద్దం పడుతోందని చెప్పారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను దారుణంగా దెబ్బ తీస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘మూడేళ్లుగా బిల్లులు చెల్లించకపోతే అధికారులు ఎలా కార్లు ఏర్పాటు చేశారు? బిల్లులు రాక వాహనాల యజమానులు పడే బాధలకు ఎవరు బాధ్యత వహిస్తారు? వ్యవస్థల నిర్వీర్యంతో అధికారులు, ఉద్యోగులు కూడా తీవ్ర ఒత్తిడికి లోనై తప్పులు చేసే పరిస్థితి వచ్చింది. ఒంగోలులో వాహనదారుడి కారును సీఎం కాన్వాయ్ కోసం తీసుకెళ్లడం వ్యవస్థ తెచ్చిన అవస్థ తప్పా మరొక్కటి కాదు. బాధ్యత లేని ప్రభుత్వం, పాలన తెలియని సీఎం ఇలాంటి ఘటనలు జరగడానికి కారణం. పాలకుల వైఫల్యాలు అటు ప్రజలతో పాటు అధికారులు, ఉద్యోగులకు కూడా శాపంలా మారుతున్నాయి. అసలు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు ఎంత?పెండింగ్లో ఉన్న బిల్లులు ఎంత? అనే అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
జాబ్ క్యాలెండర్ ఏమైంది?
‘‘ఆంధ్రప్రదేశ్లో రైతు భరోసా కింద రూ.12వేలు ఇస్తామని చెప్పి కేవలం రూ. 6 వేలు మాత్రమే ఇస్తున్నారు. వంటనూనె, ఇతర వస్తువలు ధరలు విపరీతంగా పెరిగాయి. గ్యాస్పై రాష్ట్ర ప్రభుత్వం రూ.330 వసూలు చేస్తోంది. జగన్ బటన్ నొక్కితే ఎవరి ఖాతాల్లో డబ్బులు పడట్లేదు. ఒకే విడతలో రూ.50 వేలు రుణమాఫీ చేసిన ఘనత తెదేపాది. రైతులకు ట్రాక్టర్లు, ఆధునిక వ్యవసాయ పనిముట్లు ఇచ్చాం. వైకాపా ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు ఎవరికీ ఉపకారవేతనాలు రావట్లేదు. జగన్ చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైంది? జగన్ పాలనలో మహిళలపై అత్యాచారాలు ఎక్కువ అయ్యాయి. పోలీసుల అలసత్వం వల్లే రాష్ట్రంలో అత్యాచారాలు ఎక్కవయ్యాయి. కొందరు పొరుగు రాష్ట్రం వెళ్లి మద్యం తెచ్చుకుంటున్నారు. తమిళనాడులో జయలలిత అమ్మ క్యాంటీన్లను సీఎం స్టాలిన్ తొలగించలేదు. జగన్ మాత్రం అన్న క్యాంటీన్లను తొలగించారు’’ అని చంద్రబాబు మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.