Congress presidential Polls: ‘పైలట్కు మళ్లీ చెక్’..విమర్శలకు పదును పెట్టిన భాజపా
కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీ నుంచి వెనకడుగు వేస్తున్నట్లు గహ్లోత్ ప్రకటించిన తరుణంలో అధికార భాజపా విమర్శలకు పదును పెట్టింది. గహ్లోత్ను సంపూర్ణ రాజకీయనాయకుడిగా అభివర్ణిస్తూ.. ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి ‘రబ్బరు స్టాంపు’ పదవిని వదులుకున్నారని ఎద్దేవా చేసింది.
గహ్లోత్ సంపూర్ణ రాజకీయ నాయకుడంటూ చురకలు
దిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీ నుంచి వెనకడుగు వేస్తున్నట్లు గహ్లోత్ ప్రకటించిన తరుణంలో అధికార భాజపా విమర్శలకు పదును పెట్టింది. గహ్లోత్ను సంపూర్ణ రాజకీయనాయకుడిగా అభివర్ణిస్తూ.. ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి ‘రబ్బరు స్టాంపు’ పదవిని వదులుకున్నారని ఎద్దేవా చేసింది. మరోవైపు సీఎం కుర్చీని ఆశించిన సచిన్పైలట్కు పార్టీ అధిష్ఠానం మళ్లీ ‘చెక్’ పెట్టిందని భాజపా ఐటీ సెల్ కన్వీనర్ అమిత్ మాలవీయ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో పోస్టు చేశారు.
గతంలో డిప్యూటీ సీఎంగా చేసిన సచిన్పైలట్కు ముఖ్యమంత్రి అయ్యే దారులు మూసుకుపోయాయని, ఆయన సీఎం కావాలనుకుంటే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్పై తిరుగుబావుటా ఎగరేసి తన బలాన్ని నిరూపించుకోవాలని, అధినేత్రి సోనియా గాంధీ చుట్టూ ఏర్పడిన కనిపించని పొరను తొలగించాలన్నారు.ఆయన మాటలకు భాజపా జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మద్దతు తెలిపారు. దిగ్విజయ్ సింగ్, శశి థరూర్ కలిసి ఉన్న చిత్రాన్ని ట్విటర్లో పోస్టు చేశారు. రబ్బరు స్టాంప్గా వ్యవహరించే అధ్యక్షుడి కోసం గాంధీ కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. దీనికి గహ్లోత్ ఏ విధంగానూ సరిపోరు. అందుకే ఆయన వెళ్లిపోయారు’’ అంటూ రాసుకొచ్చారు. కాంగ్రెస్ నిర్వహించబోయేవి అధ్యక్ష ఎన్నికలు కావని, కేవలం రబ్బరు స్టాంపు కోసం జరుగుతున్న ఎన్నికలని ఆయన ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో రాజస్థాన్ ముఖ్యమంత్రి గహ్లోత్ ఇవాళ భేటీఅయిన సంగతి తెలిసిందే. అనంతరం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిస్థితులకు బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవి రేసు నుంచి వైదొలగుతున్నట్లు ఆయన ప్రకటించారు. తాను ముఖ్యమంత్రిగా కొనసాగాలా? వద్దా? అనేది పార్టీ అధిష్ఠానం నిర్ణయమని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్లో ముఖ్యమంత్రిని మార్చే అవకాశముందంటూ వార్తలు వెలువడుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం