Modi: ‘యువరాజును తరిమేస్తున్నారు’.. వయనాడ్ స్థానంపై మోదీ వ్యంగ్యాస్త్రాలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని కేరళలోని వయనాడ్కు దూరంగా ఉంచాలని లెఫ్ట్ పార్టీలు కోరుకుంటున్నాయని ప్రధాని మోదీ(Modi) అన్నారు.
తిరువనంతపురం: కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య ఉన్న పొత్తుపై ప్రధాని మోదీ(PM Modi) వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. వయనాడ్(Wayanad) స్థానం నుంచి యువరాజును తరిమికొట్టాలని లెఫ్ట్ పార్టీలు కోరుకుంటున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై పరోక్ష విమర్శలు చేశారు. మంగళవారం కేరళలో పర్యటించిన ఆయన సెంట్రల్ స్టేడియంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
‘‘ఆ రెండు పార్టీలు కేరళలో బద్ధశత్రువులుగా ఉంటాయి. ఒకదానిపై ఒకటి దాడులు చేసుకుంటాయి. వేరే రాష్ట్రాల్లో మాత్రం మంచి స్నేహితులుగా మెలుగుతాయి. ఆ పార్టీల నేతలు కలిసి కూర్చొని విందారగిస్తారు’’ అని మోదీ దుయ్యబట్టారు. ఆ రెండు పార్టీలను BFF(Best Friends Forever) అంటూ ఎద్దేవా చేశారు. ‘‘వయనాడ్ నుంచి రాహుల్ గాంధీని వెళ్లగొట్టాలని లెఫ్ట్ పార్టీలు కోరుకుంటున్నాయి. కేరళకు దూరంగా ఉండమని ఆయనకు సలహా ఇస్తున్నాయి’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ (Rahul Gandhi) ప్రాతినిధ్యం వహిస్తోన్న వయనాడ్లో సీపీఐ అభ్యర్థిని నిలబెట్టిన నేపథ్యంలో మోదీ స్పందన వచ్చింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా సతీమణి యాని రాజాను అక్కడి అభ్యర్థిగా ప్రకటించింది. విపక్ష ‘ఇండియా’ కూటమిలోని ఇతర పార్టీలతో కాంగ్రెస్ ప్రస్తుతం సీట్ల సర్దుబాటు చర్చలు జరుపుతోంది. ఇంతలోనే ఇక్కడ ఈ కూటమిలోని సీపీఐ.. తన అభ్యర్థిని ప్రకటించడం గమనార్హం. అలానే ఈ కూటమిలో భాగస్వామిగా ఉన్న కేరళలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సైతం మెజార్టీ ముస్లిం ఓటర్లు ఉన్న వయనాడ్ నుంచి పోటీ చేయాలని భావిస్తోందట. ఈ నేపథ్యంలో రాహుల్గాంధీ మరోసారి వయనాడ్ నుంచి పోటీలో ఉండకపోవచ్చని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఇదిలా ఉంటే.. సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం లేదా భువనగిరి నుంచి రాహుల్ పోటీ ఉండొచ్చని తెలుస్తోంది. దీంతోపాటు ఉత్తర్ప్రదేశ్లోని అమేఠీ నుంచి కూడా ఆయన బరిలో ఉంటారని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్