Congress Files: రూ.4.8 లక్షల కోట్లు.. ఇదీ కాంగ్రెస్ అవినీతి చిట్టా: భాజపా
కాంగ్రెస్ పాలనలో రూ.4.8 లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ భాజపా ఆరోపించింది. ‘కాంగ్రెస్ ఫైల్స్’ పేరిట ఆదివారం ఓ వీడియో విడుదల చేసింది.
దిల్లీ: ‘రూ.4.8 లక్షల కోట్లు.. ఇదీ తన పాలనలో అవినీతి (Corruption) రూపేణా కాంగ్రెస్ (Congress) పార్టీ ప్రజలనుంచి దోచుకున్న డబ్బు’ అంటూ కాంగ్రెస్పై భాజపా (BJP) ఆరోపణలకు దిగింది. కాంగ్రెస్ అంటే కరప్షన్(అవినీతి) అని పేర్కొంటూ.. ‘కాంగ్రెస్ ఫైల్స్ (Congress Files)’ పేరిట ఆదివారం ఓ వీడియోను విడుదల చేసింది. యూపీఏ (UPA) హయాంలో దేశంలో ఆయా కుంభకోణాలు (Scams) వెలుగుచూశాయంటూ.. వీడియోలో వాటిని ఏకరవు పెట్టింది. బొగ్గు కుంభకోణం, 2జీ స్కామ్, కామన్వెల్త్ క్రీడల కుంభకోణం వంటివి ప్రస్తావించింది. దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ‘అవినీతిని కాపాడే ఉద్యమం’ ప్రారంభించాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఆరోపించిన క్రమంలో ఈ వీడియో వచ్చింది.
కేంద్ర సంస్థలను భాజపా ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ 14 పార్టీలు ఇటీవల సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘ఆయా కేసుల్లో ఏజెన్సీలు చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంటే.. కొందరు వాటిపై దాడులు చేస్తున్నారు. కోర్టుల్లో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కొన్ని పార్టీలు అవినీతిని కాపాడే ఉద్యమం ప్రారంభించాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలపై తరచూ ఫిర్యాదు చేస్తున్నాయి’ అని విమర్శించారు. ఇదిలా ఉండగా.. సీబీఐ, ఈడీ వంటి సంస్థలు కేవలం భాజపా రాజకీయ ప్రత్యర్థులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం