AAP-Congress: ఆర్డినెన్స్పై పోరు.. ఆమ్ఆద్మీకి కాంగ్రెస్ మద్దతిచ్చేనా?
కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఆప్ చేస్తున్న పోరాటానికి మద్దతివ్వాలా? వద్దా? అనే అంశంపై కాంగ్రెస్ (Congress) చర్చలు జరుపుతోంది. ఈ మేరకు దిల్లీ (Delhi), పంజాబ్ (Punjab) పార్టీ నేతలతో జాతీయ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ సమావేశమయ్యారు.
దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi)లో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ (Ordinance)పై ఆమ్ఆద్మీ పార్టీకి మద్దతివ్వాలా? వద్దా? అనే అంశంపై కాంగ్రెస్ (Congress) మల్లగుల్లాలు పడుతోంది. ఈ మేరకు దిల్లీ, పంజాబ్ కాంగ్రెస్ నేతలతో జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ కీలక భేటీ నిర్వహించారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మెజార్టీ నాయకులు మద్దతివ్వకూడదనే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.
కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తూ ఆమ్ఆద్మీ పార్టీ పోరును ఉద్ధృతం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక పార్టీ నేతలతో దీల్లీ సీఎం కేజ్రీవాల్ మంతనాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మద్దతును కూడా కోరినట్లు తెలుస్తోంది. దీనిపై చర్చించేందుకు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి ఫోన్ చేసి సమయం కోరినట్లు సమాచారం. అయితే, పార్టీ నాయకులతో చర్చించిన తర్వాత తమ నిర్ణయం వెల్లడిస్తానని ఖర్గే సమాధానమిచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా భేటీ జరిగినట్లు తెలుస్తోంది.
కేజ్రీవాల్కు మద్దతివ్వడం వల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండబోదని, అతడు దిల్లీ, పంజాబ్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ను దెబ్బతీశారని సమావేశం సందర్భంగా పలువును నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. కేజ్రీవాల్.. భాజపాకి బీ-టీమ్ అనీ, ఆ పార్టీకి మద్దతిస్తే.. భాజపాకి ఇచ్చినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ అధిష్ఠానం దీనిని పరిగణనలోకి తీసుకుంటే.. ఆర్డినెన్స్ విషయంలో ఆప్నకు సహకరించే అవకాశాలు కనిపించడం లేదు. కానీ, ఇతర రాష్ట్రాల నేతలతోనూ చర్చించిన తర్వాత దీనిపై కాంగ్రెస్ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
సమావేశం అనంతరం పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా మాట్లాడుతూ.. తమ అభిప్రాయాలను పార్టీ హై కమాండ్ ముందు ఉంచామని, నిర్ణయాన్ని మాత్రం అధ్యక్షుడు ఖర్గేకి వదిలేశామని చెప్పారు. ఈ సమావేశం అంతర్గత విషయాలకు సంబంధించిందని, పార్టీ అధ్యక్షుడు లేదా రాహుల్ గాంధీ మాత్రమే వివరాలను వెల్లడిస్తారని పంజాబ్ కీలక నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని ఓ పవిత్ర గ్రంథంగా అభివర్ణించిన సిద్ధూ.. దానిని స్ఫూర్తిగా తీసుకున్నట్లు చెప్పారు. కానీ, ప్రస్తుతం రాజ్యాంగ విలువలు అధోగతి పాలయ్యాయని గట్టిగా నమ్ముతున్నట్లు చెప్పారు.
మరోవైపు భాజపాకి వ్యతిరేకంగా విపక్షపార్టీలన్నీ కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్పవార్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్పట్నాయక్తో అర్వింద్ కేజ్రీవాల్ పలుదఫాలు భేటీ అయ్యారు. మరోవైపు బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని.. ఆర్డినెన్స్ విషయంలో కేజ్రీవాల్కు మద్దతివ్వాలా?వద్దా? అనే అంశంపై కాంగ్రెస్ ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434