Jaggareddy: ఆ పిచ్చితోనే కాంగ్రెస్‌లో కొనసాగుతున్నా: జగ్గారెడ్డి

రాహుల్‌ గాంధీ త్యాగాల కుటుంబమంటే తనకు చాలా ఇష్టమని, ఆ పిచ్చితోనే తాను కాంగ్రెస్‌లో కొనసాగుతున్నట్టు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు.

Updated : 26 Apr 2023 22:00 IST

హైదరాబాద్: రాహుల్‌ గాంధీ త్యాగాల కుటుంబమంటే తనకు చాలా ఇష్టమని, ఆ పిచ్చితోనే తాను కాంగ్రెస్‌లో కొనసాగుతున్నట్టు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చాలా రోజులుగా తన మనసులో ఆవేదనలు మసులుతున్నాయని, వాటిలో ఒక మాటను తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు చెబుతున్నట్టు పేర్కొన్నారు. బయటకు చెబితే ఏమవుతుందో.. చెప్పకపోతే ఏం జరుగుతుందోనన్న ఆందోళన గత కొన్ని రోజులుగా ఉందని తెలిపారు. 

తాను గాంధీ భవన్‌లో కూర్చొని ఆనందించే పరిస్థితి లేకుండా పోయిందని, తప్పనిసరి పరిస్థితుల్లో మీడియా ద్వారా ఈ ఒక్క మాట కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలకు తెలియజేస్తున్నట్టు వివరించారు. గడచిన ఐదు నెలలుగా తాను రాజకీయంగా గాంధీభవన్‌కు రాలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. గాంధీభవన్‌లో కూర్చొని తనకున్న సమస్యలను మర్చిపోయేవాడినని పేర్కొన్నారు. ఇవాళ అలాంటి పరిస్థితి లేకుండా పోయిందని జగ్గారెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు