Hema Malini : రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం నేను చూడలేదు : భాజపా ఎంపీ హేమమాలిని
లోక్సభలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం తాను చూడలేదని భాజపా ఎంపీ హేమమాలిని (Hema Malini) అన్నారు. అయినా ఆమె కల్పిత ఫిర్యాదుపై సంతకం చేశారని కాంగ్రెస్ (Congress) నేత బీవీ శ్రీనివాస్ ట్విటర్లో విమర్శించారు.
దిల్లీ : లోక్సభ నుంచి బయటకు వెళుతూ కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) చేసిన ఆరోపణలపై ప్రముఖ నటి, భాజపా ఎంపీ హేమమాలిని స్పందించారు. తాను అలాంటి సైగను చూడలేదని ఆమె చెప్పారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొని బయటకు వచ్చిన ఆమెను ఓ మీడియా ప్రతినిధి ‘మీరు ఆయన ఫ్లయింగ్ కిస్ ఇస్తుండగా.. అభ్యంతరకరంగా సైగ చేస్తుండగా చూశారా? అని ప్రశ్నించాడు. దానికి ఆమె బదులిస్తూ.. నాకు తెలియదు. నేను అది చూడలేదు. కొన్ని పదాలు సరిగా లేవని’ చెప్పారు. ఈ వీడియోను కాంగ్రెస్ నేత బీవీ శ్రీనివాస్ ట్విటర్లో పోస్టు చేశారు. ఎలాంటి ఫ్లయింగ్ కిస్ చూడలేదని చెప్పిన హేమమాలిని.. కల్పిత ఫిర్యాదుపై మాత్రం సంతకం చేశారని ఆయన విమర్శించారు.
రాహుల్పై ‘ఫ్లయింగ్ కిస్’ఆరోపణ.. స్పీకర్కు మహిళా ఎంపీల ఫిర్యాదు!
ఎంపీ కార్తీ చిదంబరం మాట్లాడుతూ మణిపుర్ అంశంపై రాహుల్ గాంధీ ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తారని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా నిలదీశారన్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా భాజపా కొత్త వ్యూహాన్ని మధ్యలో తీసుకొచ్చిందని ఆయన విమర్శించారు. ఏ అంశంపై తాము ప్రశ్నించినా అధికార పార్టీ ఎంపీలు సంబంధం లేని విషయాలను మాట్లాడతారని, గతంలో జరిగిన విషయాలను ప్రస్తావించి అసలు విషయాన్ని దారి మళ్లిస్తారని కార్తీ ఆరోపించారు.
అవిశ్వాసంపై చర్చ సందర్భంగా లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అనుచితంగా ప్రవర్తించారంటూ భాజపాకు చెందిన మహిళా ఎంపీలు ఆరోపించారు. రాహుల్ సభ నుంచి బయటకు వెళుతూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ‘స్త్రీ వ్యతిరేకి మాత్రమే పార్లమెంట్లో మహిళా ఎంపీలకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వగలరు. అలాంటి విపరీతాలను ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. ఆయన మహిళల గురించి ఏం ఆలోచిస్తున్నారో ఈ ప్రవర్తన తెలియజేస్తోంది. ఇది అసభ్యకరమైనది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆ పార్టీ మహిళా ఎంపీలతో కలిసి స్పీకర్కు ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి