TDP: రెండుచోట్ల దొంగ ఓట్లతో సజ్జల అడ్డంగా దొరికిపోయారు: ధూళిపాళ్ల నరేంద్ర

సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గాల్లో రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు.

Published : 13 Feb 2024 20:28 IST

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గాల్లో రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. రాష్ట్రంలో దొంగ ఓట్ల దందాకు తాడేపల్లిలోనే కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వమనడానికి ఇదే ఉదాహరణ అని పేర్కొన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌లోనే దొంగ ఓట్ల దందా మొదలైందనడానికి ఇదిగో సాక్ష్యమంటూ ఆ వివరాలను ట్వీట్‌ చేశారు. తెల్లారితే మైక్‌ ముందు నీతి వ్యాఖ్యాలు వల్లించే సజ్జల రెండు చోట్ల దొంగ ఓట్లతో అడ్డంగా దొరికిపోయారని, ఇప్పుడేం సమాధానం చెబుతారని నిలదీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని