Sonu Sood: సోనూసూద్పై ఎన్నికల సంఘం ఆంక్షలు.. కారణమిదే
పంజాబ్లో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో.. బాలీవుడ్ నటుడు సోనూసూద్ కదలికలను ఎన్నికల సంఘం కట్టడి చేసింది. ఇక్కడి మోగాలోని పోలింగ్...
చండీగఢ్: పంజాబ్లో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనే ఫిర్యాదుల మేరకు.. బాలీవుడ్ నటుడు సోనూసూద్ కదలికలను ఎన్నికల సంఘం కట్టడి చేసింది. ఇక్కడి మోగాలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించకుండా.. ఆయనపై నిషేధం విధించింది. ఆయన సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ తరఫున మోగా నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని శిరోమణి అకాలీదళ్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ఈసీఐ ఆయన కారును స్వాధీనం చేసుకుంది.
అయితే.. సోనూసూద్ ఈ ఆరోపణలను ఖండించారు. ‘నేను స్థానికుడిని. ఒక పార్టీ అభ్యర్థికి ఓటేయమని ఎవరినీ అడగలేదు. పోలింగ్ కేంద్రాల బయట ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శిబిరాలను సందర్శిస్తున్నా’ అని తెలిపినట్లు ఓ వార్తాసంస్థ పేర్కొంది. జిల్లా మేజిస్ట్రేట్ హరీష్ నయ్యర్ సైతం ఈ వ్యవహారంపై మోగా ఎస్ఎస్పీని నివేదిక కోరారు. సోనూసూద్ పోలింగ్ కేంద్రాలను సందర్శించడాన్ని కొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరకరంగా భావించాయని చెప్పారు. మరోవైపు.. మోగాలోని ఇతర పార్టీల అభ్యర్థులు ఓట్ల కొనుగోలుకు యత్నిస్తున్నారని సోనూసూద్ ఆరోపించారు. ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఆదివారం ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. ఎలక్షన్కు ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఆయన్ను పంజాబ్ రాష్ట్ర ఎన్నికల ఐకాన్గా నియమించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో మరో ఇద్దరు అధికారులపై బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్