YS Sharmila: వైఎస్‌ షర్మిలపై కేసు నమోదు

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila)పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్‌ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 07 May 2024 10:34 IST

బద్వేలు: ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila)పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్‌ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల వేళ వివేకా హత్య కేసు అంశంపై మాట్లాడొద్దని ఇటీవల కడప కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

జమ్మలమడుగు వైకాపా అభ్యర్థిపై ఆర్వో ఫిర్యాదు

జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఆర్వో శ్రీనివాస్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రానికి వైకాపా కండువాతో సుధీర్‌రెడ్డి వచ్చారని ఆర్వో తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని