presidential Election: విపక్షాలకు మరో షాక్.. రాష్ట్రపతి రేసుకు నో చెప్పిన ఫరూఖ్ అబ్దుల్లా
రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి కోసం ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతోన్న వేళ.. వారికి మరో షాక్ తగిలింది. రాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఉండేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా కూడా నిరాకరించారు.
శ్రీనగర్: రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి కోసం ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతోన్న వేళ.. వారికి మరో షాక్ తగిలింది. రాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఉండేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా కూడా నిరాకరించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీలు సమావేశమైన విషయం తెలిసిందే. ఈ భేటీలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ, ఫరూఖ్ అబ్దుల్లా పేర్లను మమత ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనల నుంచి తన పేరును ఉపసంహరించుకుంటున్నట్లు ఫరూఖ్ నేడు తెలిపారు.
‘‘రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మమతా బెనర్జీ నా పేరును ప్రతిపాదించడం ఆనందంగా ఉంది. ఆ తర్వాత చాలా మంది విపక్ష నేతలు నాకు ఫోన్ చేసి మద్దతు తెలిపారు. అది నా మనసును ఎంతగానో హత్తుకుంది. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ అనూహ్య ప్రతిపాదనపై నేను మా పార్టీ సీనియర్ నేతలు, కుటుంబసభ్యులతో చర్చించాను. అయితే ప్రస్తుతం జమ్మూకశ్మీర్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ అనిశ్చిత పరిస్థితుల నుంచి జమ్మూకశ్మీర్ను బయటపడేసేందుకు నా వంతు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. క్రియాశీల రాజకీయాల్లో ఇంకా కొన్ని రోజులు ఉండాలనుకుంటున్నా. జమ్మూకశ్మీర్తో పాటు ఈ దేశ సేవలో సానుకూల సహకారం అందించేందుకు ఎదురుచూస్తున్నా. అందువల్ల రాష్ట్రపతి రేసు నుంచి నా పేరును ఉపసంహరించుకుంటున్నా. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థికి నా మద్దతు ఉంటుంది’’ అని ఫరూఖ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
అంతకుముందు, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉండేందుకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ కూడా నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ పదవికి పవార్ పేరును మమత ప్రతిపాదించగా.. ఇంకా క్రియాశీల రాజకీయాల్లో ఇన్నింగ్స్ ఆడాల్సి ఉందని చెప్తూ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో విపక్షాలు తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టుకోవడంలో సఫలమవుతాయన్న దానిపై శరద్ పవార్ నమ్మకంగా లేరట. అందుకే ఓడిపోయే పోరులో బరిలోకి దిగేందుకు ఆయన సుముఖంగా లేరని ఇదివరకే ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా.. జూన్ 15న దీదీ నేతృత్వంలో జరిగిన విపక్షాల సమావేశం సశేషంగా ముగిసింది. దీంతో 20-21వ తేదీల్లో మరోసారి భేటీ కావాలని ప్రతిపక్ష నేతలు నిర్ణయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం