Ganta Srinivasarao: అలాంటిదేమైనా ఉంటే నేనే చెప్తా: గంటా శ్రీనివాసరావు

తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని.. అలాంటిదేమైనా ఉంటే తానే చెప్తానని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పునరుద్ఘాటించారు.

Published : 15 Dec 2022 13:46 IST

విజయవాడ: తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని.. అలాంటిదేమైనా ఉంటే తానే చెప్తానని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పునరుద్ఘాటించారు. బుధవారం రాత్రి విజయవాడలోని గంటా నివాసంలో ఆయనతో భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ, తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు గంటాను ప్రశ్నించగా ఓ వివాహం సందర్భంగా అందరం కలిశామని చెప్పారు. ఇది సాధారణమేనని.. దీనిలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం ఏమీ లేదని స్పష్టం చేశారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో మాజీ మంత్రి కన్నా బుధవారం భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గంటాతోనూ కన్నా లక్ష్మీనారాయణ సమావేశం కావడం చర్చనీయాంశమైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని