‘వారికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు?’
తెదేపాకు ఎంతోకాలంగా నమ్మకంగా ఉన్న ఉత్తరాంధ్రులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ద్రోహం చేస్తు్న్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం విశాఖకు పాలనా రాజధాని రాకుండా...
విశాఖ: తెదేపాకు ఎంతోకాలంగా నమ్మకంగా ఉన్న ఉత్తరాంధ్రులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ద్రోహం చేస్తు్న్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం విశాఖకు పాలనా రాజధాని రాకుండా అమరావతి రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపిచారు. మధురవాడలోని శిల్పారామంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. అమరావతిని పూర్తిగా తరలించడం లేదని.. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం కోరుకుంటున్నారని ఆయన వివరించారు. విశాఖ జిల్లాలో తెదేపాకు నలుగురు ఎమ్మెల్యేలను ప్రజలు ఇచ్చారని.. వారికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఈ విషయంలో విశాఖ వాసులకు ఆయన క్షమాపణ చెప్పాలని అవంతి డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంత రైతులకు సీఎం జగన్ తప్పకుండా న్యాయం చేస్తారన్నారు.
లేని ఉద్యమాన్ని సృష్టిస్తున్నారు: కన్నబాబు
నిజమైన రైతుల ఆందోళన ఒకలా ఉంటే తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన మరోలా ఉందని మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. రైతులను రెచ్చగొట్టే చర్యలను ఆయన మానుకోవాలని హితవు పలికారు. విజయవాడలో మీడియాతో కన్నబాబు మాట్లాడారు. లేని ఉద్యమాన్ని చంద్రబాబు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.