‘వారికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు?’

తెదేపాకు ఎంతోకాలంగా నమ్మకంగా ఉన్న ఉత్తరాంధ్రులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ద్రోహం చేస్తు్న్నారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ మండిపడ్డారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం విశాఖకు పాలనా రాజధాని రాకుండా...

Published : 14 Jan 2020 00:45 IST

విశాఖ: తెదేపాకు ఎంతోకాలంగా నమ్మకంగా ఉన్న ఉత్తరాంధ్రులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ద్రోహం చేస్తు్న్నారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ మండిపడ్డారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం విశాఖకు పాలనా రాజధాని రాకుండా అమరావతి రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపిచారు. మధురవాడలోని శిల్పారామంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. అమరావతిని పూర్తిగా తరలించడం లేదని.. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం కోరుకుంటున్నారని ఆయన వివరించారు. విశాఖ జిల్లాలో తెదేపాకు నలుగురు ఎమ్మెల్యేలను ప్రజలు ఇచ్చారని.. వారికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఈ విషయంలో విశాఖ వాసులకు ఆయన క్షమాపణ చెప్పాలని అవంతి డిమాండ్‌ చేశారు. రాజధాని ప్రాంత రైతులకు సీఎం జగన్‌ తప్పకుండా న్యాయం చేస్తారన్నారు.

లేని ఉద్యమాన్ని సృష్టిస్తున్నారు: కన్నబాబు

నిజమైన రైతుల ఆందోళన ఒకలా ఉంటే తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన మరోలా ఉందని మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. రైతులను రెచ్చగొట్టే చర్యలను ఆయన మానుకోవాలని హితవు పలికారు. విజయవాడలో మీడియాతో కన్నబాబు మాట్లాడారు. లేని ఉద్యమాన్ని చంద్రబాబు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని