కేటీఆర్.. ఏం సమాధానం చెప్తారు: లక్ష్మణ్
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన తెరాస ప్రభుత్వం ఈ ఆరేళ్ల పాలనలో ఎంత మందికి అందజేసిందో చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో...
హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన తెరాస ప్రభుత్వం ఈ ఆరేళ్ల పాలనలో ఎంత మందికి అందజేసిందో చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వస్తేనే యువతకు కొలువులు వస్తాయని చెప్పిన తెరాస ఈ ఆరేళ్ల పాలనలో 20 వేలకు మించి ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు. వాటిలో 50 శాతానికిపైగా పోలీసు ఉద్యోగాలే ఉన్నాయని.. అవి కూడా అధికార పార్టీ నేతల రక్షణ కోసమే అని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని పురపాలికలకు కేంద్ర ప్రభుత్వం రూ.1030 కోట్లు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటిని విడుదల చేయకుండా ఏరకమైన అభివృద్ధికి పాటుపడుతుందని ప్రశ్నించారు. జిల్లాల్లోని నియోజకవర్గాల్లో సమీక్షలు నిర్వహిస్తూ ఎక్కువ సమయం జిల్లాల్లో గడుపుతానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాటతప్పారని విమర్శించారు.
హైదరాబాద్ మాదిరిగా రాష్ట్రంలోని మున్సిపాలిటీలన్నింటిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి.. ఏమేరకు వాటిని నెరవేర్చారో కేటీఆర్ సమాధానం చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లేఅవుట్లు, భవన నిర్మాణాల్లో అవినీతి పెచ్చుమీరిందని.. పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేసి ప్రజల నుంచి అధిక మొత్తంలో పన్నులు వసూలు చేస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. పట్టణాల్లో మంచినీటి సరఫరా, ప్రజా రవాణా వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు, రాయితీలు కల్పిస్తుంటే వాటిని ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే సంస్థలు, వ్యక్తులకు అప్పనంగా కట్టబెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.