మందడంలో చంద్రబాబుకు ఘనస్వాగతం

ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతున్నట్లు ఛైర్మన్‌ షరీఫ్‌ ప్రకటించిన నేపథ్యంలో తెదేపా శ్రేణులు, రాజధాని ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 22 Jan 2020 23:47 IST

మందడం: ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతున్నట్లు ఛైర్మన్‌ షరీఫ్‌ ప్రకటించిన నేపథ్యంలో తెదేపా శ్రేణులు, రాజధాని ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మందడం రహదారిపైకి వచ్చి సేవ్‌ అమరావతి అంటూ రైతులు నినాదాలు చేస్తున్నారు. జాతీయ జెండాలు పట్టుకొని జై అమరావతి అంటూ పలు చోట్ల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. శాసనమండలి నిర్ణయం తర్వాత తెదేపా అధినేత చంద్రబాబు సైతం మందడం చేరుకున్నారు. ఆయనకు రైతులు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు కారులో నుంచి రైతులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అక్కడికి చేరుకున్న లోకేశ్‌, ఎమ్మెల్యే బాలకృష్ణకు రైతులు, మహిళలు అభినందనలు తెలిపారు. 

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని