గవర్నర్‌తో మండలి ఛైర్మన్‌ కీలక భేటీ

ఏపీ శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌కు చేరుకున్న ఆయన.. పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులపై సెలెక్ట్‌ కమిటీ నియమించే అంశంపై...

Published : 18 Feb 2020 18:56 IST

అమరావతి: ఏపీ శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌కు చేరుకున్న ఆయన.. పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులపై సెలెక్ట్‌ కమిటీ నియమించే అంశంపై గవర్నర్‌తో కీలకంగా చర్చించనున్నారు. సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు చేయాలని ఛైర్మన్‌ రెండుసార్లు కార్యదర్శిని ఆదేశించినా మండలి కార్యాలయం సంబంధిత ఫైలును వెనక్కి పంపించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై అసంతృప్తితో ఉన్న షరీఫ్‌.. మండలిలో చోటుచేసుకున్న పరిణామాలను గవర్నర్‌కు వివరించనున్నట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని