తితిదే ఆస్తులు అమ్ముతారా? పునరాలోచించండి!
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల అమ్మకం నిలిపివేయాలని తితిదే బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడు, రాజ్యసభ సభ్యుడు రాకేశ్ సిన్హా కోరారు. ఈ మేరకు ఆయన ...
సుబ్బారెడ్డికి బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడు రాకేశ్ సిన్హా లేఖ
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల అమ్మకం నిలిపివేయాలని తితిదే బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడు, రాజ్యసభ సభ్యుడు రాకేశ్ సిన్హా కోరారు. ఈ మేరకు ఆయన తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి లేఖ రాశారు. బోర్డు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు. శ్రీవారికి భక్తులు విరాళంగా ఆస్తులు ఇచ్చారనీ.. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమైనందున ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఆయన సుబ్బారెడ్డిని కోరారు.
శ్రీవారి స్థిరాస్తులను అమ్మాలని తితిదే ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తమిళనాడులో ఉన్న 23 ఆస్తులు విక్రయించాలని ఎనిమిది మంది అధికారులతో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. ఈ ఆస్తుల బహిరంగ వేలానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాలని ఆదేశించింది. తితిదే తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బోర్డు సభ్యుడే లేఖ రాయడం మరింత తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ నెల 28న జరిగే ధర్మకర్తల మండలి సమావేశంలో దీనిపై పూర్తిస్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం