కాంగ్రెస్.. తెరాస కొమ్ము కాస్తోంది: బండి సంజయ్
రాష్ట్రంలో ఆరోగ్య అత్యయిక స్థితి ప్రకటించాలని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్: రాష్ట్రంలో ఆరోగ్య అత్యయిక స్థితి ప్రకటించాలని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి విషయమై సంజయ్ మీడియాతో ఆన్లైన్లో మాట్లాడారు. కరోనా కట్టడికి కేంద్రం ఎన్ని చర్యలు తీసుకున్నా, రాష్ట్రానికి ఎన్ని రకాల సహాయాలు అందించినా... కేంద్రంపై తెరాస నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.
‘‘సెక్షన్ 8పై గవర్నర్ జోక్యం చేసుకున్నారు. దీనిపై గవర్నర్ అభిప్రాయం తరువాత మేం స్పందిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్రానికి గవర్నర్ ఏం ఫిర్యాదు చేస్తారో చూసి రాష్ట్ర పార్టీగా మా అభిప్రాయం చెప్తాం. సెక్రెటరీయేట్ కూల్చివేత నిర్ణయాన్ని భాజపా రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తోంది. భాజపాపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్... తెరాసకు కొమ్ముకాస్తోంది’’ అని బండి సంజయ్ విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.