కాంగ్రెస్‌.. తెరాస కొమ్ము కాస్తోంది: బండి సంజయ్‌

రాష్ట్రంలో ఆరోగ్య అత్యయిక స్థితి ప్రకటించాలని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

Published : 10 Jul 2020 01:18 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆరోగ్య అత్యయిక స్థితి ప్రకటించాలని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి విషయమై సంజయ్‌ మీడియాతో ఆన్‌లైన్‌లో మాట్లాడారు. కరోనా కట్టడికి కేంద్రం ఎన్ని చర్యలు తీసుకున్నా, రాష్ట్రానికి ఎన్ని రకాల సహాయాలు అందించినా... కేంద్రంపై తెరాస నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్‌ మండిపడ్డారు. 

‘‘సెక్షన్ 8పై గవర్నర్ జోక్యం చేసుకున్నారు. దీనిపై గవర్నర్ అభిప్రాయం తరువాత మేం స్పందిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్రానికి గవర్నర్ ఏం ఫిర్యాదు చేస్తారో చూసి రాష్ట్ర పార్టీగా మా అభిప్రాయం చెప్తాం. సెక్రెటరీయేట్ కూల్చివేత నిర్ణయాన్ని భాజపా రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తోంది. భాజపాపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్... తెరాసకు కొమ్ముకాస్తోంది’’ అని బండి సంజయ్‌ విమర్శించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని