భారాసలోకి మహారాష్ట్ర నేతలు
మహారాష్ట్రకు చెందిన మాజీ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరిసింగ్ రాథోడ్ సహా పలువురు నేతలు శనివారం హైదరాబాద్లో భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో భారాసలో చేరారు.
కేసీఆర్ సమక్షంలో మాజీ ఎంపీ సహా పలువురి చేరిక
ఈనాడు, హైదరాబాద్: మహారాష్ట్రకు చెందిన మాజీ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరిసింగ్ రాథోడ్ సహా పలువురు నేతలు శనివారం హైదరాబాద్లో భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో భారాసలో చేరారు. చంద్రాపూర్ జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు సందీప్ కరపే, గోండ్ పిప్రినగర్ సేవక్, భాజపా తాలూకా అధ్యక్షుడు బాబన్ నికోడె, సమన్వయకర్త ఫిరోజ్ఖాన్, భాజపా నాయకుడు శైలేష్ సింగ్ బైసెలు భారాసలోకి వచ్చారు. వారందరికీ కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హరిసింగ్ మాట్లాడుతూ.. కేసీఆర్ జాతీయ దార్శనికత, విధానాలు నచ్చి పార్టీలో చేరుతున్నామన్నారు. మహారాష్ట్రలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు.
ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ గడువు పెంచాలి
ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ఉద్దేశించిన జీవో నెం.58 దరఖాస్తు గడువు పెంచాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సీఎం కేసీఆర్ను కోరారు. శనివారం ఆయన ప్రగతిభవన్లో ముఖ్యమంత్రిని కలిశారు. తన నియోజకవర్గ పరిధిలోని పేదలు చాలామంది ఇళ్ల క్రమబద్ధీకరణ కోరుతున్నారని, ప్రభుత్వం నిర్దేశించిన గడువులో వారు దరఖాస్తు చేసుకోనందున గడువు పెంచాలన్నారు. జీవో నం.58 దరఖాస్తు గడువు పెంపుపై సీఎం సానుకూలంగా స్పందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు