pawan kalyan : వారాహి వాహనంలో ఆవిర్భావ సభకు బయలుదేరిన పవన్‌

జనసేన పార్టీ పదో వార్షిక ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయవాడ నుంచి మచిలీపట్నం బయలుదేరారు.

Published : 14 Mar 2023 15:51 IST

విజయవాడ :  జనసేన పార్టీ పదో వార్షిక ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయవాడ నుంచి మచిలీపట్నం బయలుదేరారు. ఆటోనగర్‌లో పవన్‌కు గజమాలతో ప్రజలు ఘన స్వాగతం పలికారు. వారాహి వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా పవన్‌ ముందుకెళ్తున్నారు. కౌలు రైతుల కుటుంబ సభ్యులను పవన్‌ పరామర్శించి.. 47 కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు.

జనసేన పార్టీ ఆవిర్భావ సభ మచిలీపట్నంలో సాయంత్రం జరగనుంది. అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, ఇతర నేతలు పాల్గొననున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. సాయంత్రం 5 గంటలకు పవన్‌ సభా ప్రాంగణానికి చేరుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని