Panchumarthi Anuradha : చంద్రబాబును కలిసిన పంచుమర్తి అనురాధ

తెదేపా తరఫున నూతన  ఎమ్మెల్సీగా ఎన్నికైన పంచుమర్తి అనురాధ ఆ పార్టీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు.

Published : 24 Mar 2023 14:10 IST

అమరావతి : తెదేపా తరఫున నూతన  ఎమ్మెల్సీగా ఎన్నికైన పంచుమర్తి అనురాధ ఆ పార్టీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చి గెలిపించినందుకు ఆమె చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబుతోపాటు పార్టీ నేతలు పయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు, బొండా ఉమామహేశ్వరరావు తదితరులు అనురాధకు శుభాకాంక్షలు తెలిపారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నిన్న జరిగిన ఎన్నికల్లో అనురాధ వైకాపాకు షాకిచ్చిన విషయం తెలిసిందే. వైకాపాకు కొందరు సొంత ఎమ్మెల్యేలే మొండి చేయి చూపి.. పంచుమర్తి అనురాధకు ఓటేసి ఘన విజయం కట్టబెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని