కేంద్రానిది ‘సమాఖ్య’పై దాడే
దిల్లీలో పరిపాలన సేవల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడం సమాఖ్య వ్యవస్థపై దాడి చేయడమేనని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు.
ఆప్ ఆందోళనకు మద్దతు - సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
దిల్లీ: దిల్లీలో పరిపాలన సేవల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడం సమాఖ్య వ్యవస్థపై దాడి చేయడమేనని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. కేంద్రం చర్యను ఖండిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంటు ముందుకు ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును తీసుకొచ్చినప్పుడు ఆప్నకు మద్దతుగా దానిని వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. దిల్లీలోని సీపీఎం కార్యాలయంలో ఏచూరితో దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్డినెన్స్ అంశంలో వామపక్ష పార్టీల మద్దతు కోరారు. ఈ క్రమంలో ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీకి అండగా నిలవాలని ఏచూరి పిలుపునిచ్చారు. కేంద్రం చర్య నిస్సిగ్గు ఉల్లంఘన అని అభివర్ణించారు. రాజ్యాంగం, సమాఖ్య వ్యవస్థకు ఆధారాలైన స్తంభాలపై భాజపా ప్రభుత్వం దాడికి దిగి నాశనం చేస్తోందని ఆరోపించారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ..ఆర్డినెన్స్పై బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చినప్పుడు ప్రతిపక్షాల ఐక్యత దాన్ని అడ్డుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం